పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం | Hamas involved in Pahalgam terror attack| Israel comments |RTV
పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం ఉందని ఆరోపిస్తోంది ఇజ్రాయెల్. హమాస్ అగ్రనేతలు పాకిస్తాన్ లో ఉన్నరని...లష్కరే తోయిబాతో కలిసి పని చేస్తున్నారని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ధృవీకరించారు.
మొట్టమొదటిసారి పాలస్తీనా ప్రభుత్వం హమాస్ కు వ్యతిరేకంగా మాట్లాడింది. హమాస్ కుక్కల్లారా బందీలను విడిచిపెట్టండి అంటూ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఏకంగా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
సౌదీ అరేబియా.. ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చింది. గాజా, లెబనాన్పై చేస్తున్న దాడులు వెంటనే ఆపేయాలని అల్టిమేటం జారీ చేసింది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సౌదీ ఇంత ఘాటుగా స్పందించడం ఇదే మొదటిసారి.
అక్టోబరు 7 నాటి హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయేల్.. అత్యంత దుర్మార్గపు చర్యలకు తెగబడుతోంది. గాజాను మరుభూమిగా మారుస్తోంది.పాలస్తీనియన్ పౌరులు తిరిగి రావడానికి అక్కడ ఏమీ మిగలదని ఇజ్రాయేల్ సైనికులే చెబుతున్నారు.
హమాస్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హమాస్పై రాకెట్లు, మిస్సైల్స్తో వైమానిక దాడులు చేయడంతో మొత్తం 32 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మృతుల్లో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత వారం రోజుల్లో ఈ దాడుల్లో 64 మంది మృతి చెందారు.
హమాస్కు వ్యతిరేకంగా ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో ప్రజలు నిరసనలు చేపట్టారు. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లుపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. హమాస్ అవుట్ అంటూ నినాదాలు చేస్తూ.. తక్షణమే యుద్ధం ముగించాలని డిమాండ్ చేస్తున్నారు.
హమాస్ అంతమే లక్ష్యంగా మరోసారి ఇజ్రాయెల్ భీకరదాడులకు దిగింది.ఈ దాడుల్లో పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ సీనియర్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ బర్హౌమ్ సహా ఐదుగురు చనిపోయినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి.
2023 అక్టోబర్లో ప్రారంభమైన ఇజ్రాయెల్ దాడులు ఇప్పటికీ ఆగడం లేదు. ఇప్పటి వరకు నిర్వహించిన దాడుల్లో 50 వేల మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే 1.13 లక్షల మంది గాయపడినట్లు వెల్లడించింది.