Israel-Hamas: ఖతార్ లో ఇజ్రాయెల్ దాడి.. హమాస్ నేతలే టార్గెట్
ఖతార్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హమాస్ నేతలే లక్ష్యంగా సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో దోహాలో బాంబు దాడిచేసింది. ఇందులో హమాస్ కీలక నేత ఖలీల్ అల్-హయ్యా కుమారుడు సహా ఆరుగురు మృతి చెందారు.
ఖతార్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హమాస్ నేతలే లక్ష్యంగా సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో దోహాలో బాంబు దాడిచేసింది. ఇందులో హమాస్ కీలక నేత ఖలీల్ అల్-హయ్యా కుమారుడు సహా ఆరుగురు మృతి చెందారు.
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతోంది. తాజాగా జరిపిన ఈ దాడుల్లో సుమారుగా 47 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ దాడులు పెరుగుతాయని గాజా నగరంలో ఉన్న ప్రజలు ఈ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది.
ఇజ్రాయిల్ గాజాపై మారణఖాండ కొనసాగిస్తూనే ఉంది. సోమవారం గాజాలోని నాసర్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు జర్నలిస్టులు సహా 15 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు.
గాజాలో అల్ జజీరాకు చెందిన ఐదుగురు జర్నలిస్టులను చంపేసింది ఐడీఎఫ్. వీరిలో ఒకరు హమాస్ ఉగ్రవాదని...అతను జర్నలిస్టుగా నటిస్తున్నాడని ఐడీఎఫ్ వాదిస్తోంది. జర్నలిస్టుల మృతి అల్ జజీరా ఛానెల్ కూడా ధృవీకరించింది.
గాజా స్ట్రిప్ను పూర్తిగా ఆక్రమించుకునేందుకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ శుక్రవారం తెల్లవారుజామున ఆమోదం తెలిపింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలో కేబినెట్ సమావేశమైంది. ఈ నిర్ణయం ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఒక కీలకంగా మారబోతుంది.
హమాస్ ను అంతం చేసే ప్లాన్ లో భాగంగా మొత్తం గాజానే స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు నెతన్యాహు. అయితే దీనిపై ఐడీఎఫ్ తో పాటూ ఇతర ఇజ్రాయెల్ నేతలు, మాజీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. నెతన్యాహును ఆపాలంటూ ట్రంప్ కు లేఖ రాసారు.
ఇజ్రాయెల్యుద్ధంతో విలవిలలాడుతున్న గాజాలో ఆకలి చావులు కలచివేస్తున్నాయి. సరైన ఆహారం దొరకక వృద్దులు, పిల్లలు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటివరకు 111 మంది ఆకలితో మరణించారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 80 మంది చిన్నారులే ఉండటం ప్రపంచాన్ని కుదిపేస్తోంది.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ఓ కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. గత 21 నెలలుగా గాజాలో కొనసాగుతున్న యుద్ధంలో 59 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని అక్కడి వైద్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దయనీయంగా మారింది. దానికి తోడు అక్కడ కరువు తాండవిస్తోంది. పట్టెడన్నం కోసం పాలస్తీనియన్లు దేనికైనా వెనకాడడం లేదు. ఈ క్రమంలో గాజాలో సహాయక కేంద్రంలో తొక్కిసలాట జరిగింది. దీంట్లో 20 మంది చనిపోయారు.