Massive Floods In China : చైనాలో వరద తాండవం..! | Guizhou province submerged | Emergency Declared
కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఆలమట్టి ఆనకట్ట నుంచి అధిక నీటి విడుదల కారణంగా ప్రియదర్శి జూరాలకు పెద్ద మొత్తంలో నీరు చేరుతోంది. 85 వేల క్యూసెక్కులు ఇన్ ఫ్లోతో శనివారం 7 గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు.
గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. బోటాడ్ జిల్లాలో తొమ్మిది మంది ప్రయాణికులతో వెళ్తున్న కారు నదిలో కొట్టుకుపోవడంతో బుధవారం నలుగురు చనిపోయారు. పలు జిల్లాల్లో 48 గంటల్లో వరదల కారణంగా 22 చనిపోయారు.
దక్షిణాఫ్రికాలో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. తూర్పు కేప్ ప్రావిన్స్లో వరదల కారణంగా ఇప్పటివరకు 49 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాలు భారీ వర్షం, మంచుతో అతలాకుతలం అయ్యాయని తెలిపారు. అనేక ప్రాంతాలు నీటి ముంపునకు గురయ్యాయి,
చైనాలో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఊహన్, గాంగ్డాంగ్, గాంగ్జీ, జీజియాంగ్ నగరాలు నీటమునిగాయి. కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గల్లంతయ్యారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ కు వరదల ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. భారత్ వైపు నుంచి నీటి ప్రవాహం పెరిగిపోయిందని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
మలేషియా, దక్షిణ థాయ్లాండ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రోడ్డు, ఇళ్లు, భవనాలు, పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ వరద బీభత్సవం వల్ల దాదాపు 30 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది.