HYD: టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళల్లో ముగిసిన ఐటీ సోదాలు
మూడురోజులుగా టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళల్లో జరుగుతున్న ఐటీ సోదాలు ముగిశాయి. నిన్న అర్థరాత్రితో అన్నిచోట్లా ఐటీ అధికారులు సోదాలను ముగించారు. దాదాపు 55మందితో కూడిన బృందం 16 చోట్ల తనిఖీలు చేశారు.
మూడురోజులుగా టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళల్లో జరుగుతున్న ఐటీ సోదాలు ముగిశాయి. నిన్న అర్థరాత్రితో అన్నిచోట్లా ఐటీ అధికారులు సోదాలను ముగించారు. దాదాపు 55మందితో కూడిన బృందం 16 చోట్ల తనిఖీలు చేశారు.
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. ఐటీ రైడ్స్ జరుగుతున్న సమయంలో ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఐటీ అధికారుల వాహనంలో ఆమెను ఆస్పత్రికి తరలించారు.
టాలీవుడ్లో ఐటీ రైడ్స్పై హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. నిర్మాత దిల్ రాజు ఒక్కడిపైనే ఐటీ దాడులు జరగడం లేదని అన్నారు. తాను తీసుకునేది తక్కువేనని.. అదికూడా వైట్ మనీ మాత్రమే తీసుకుంటానని వెంకటేష్ చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ లో వరుసగా రెండో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.
హైదరాబాద్ లో ఉదయం నుంచి పలువురి ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిర్మాత దిల్ ఇల్లు, ఆఫీసులో కూడా సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో అయన భార్య తేజశ్వినిని బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయమని అడగ్గా.. లాకర్స్ ఓపెన్ చేసి చూపించినట్లు తేజశ్విని తెలిపారు.
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు బిగ్ షాక్ తగిలింది. ఆయన ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు ఇంటితో పాటుగా హైదరాబాద్ లోని 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇల్లు,ఆఫీసుల్లో అధికారులు సోదాలు చేపట్టారు.
తెలంగాణ ప్రజలకు నిర్మాత దిల్ రాజు క్షమాపణలు చెప్పారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారిన నేపథ్యంలో తాజాగా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ సంస్కృతిని నేను అభిమానిస్తానని, నా మాటల్లో తప్పుంటే క్షమించమని కోరారు.