Dil Raju-IT Raids: ఫేక్ కలెక్షన్స్ చూపెట్టడం నిజంగా తప్పే.. దిల్ రాజ్ సంచలన ప్రెస్‌మీట్‌!

కలెక్షన్స్ ఎక్కువ చేసి చూపించడం మీద ఇండస్ట్రీ అంతా కూర్చొని మాట్లాడడామన్నారు. అది తప్పు.. తీరు మార్చుకొవాల్సిందేనన్నారు. ఫిబ్రవరి 3న ఐటీ అధికారులు కలవమన్నట్లు చెప్పారు. తమ వద్ద రికార్డ్స్ క్లీన్ గా ఉండడం చూసి ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారన్నారు.

New Update
Dil Raju Over IT Raids

Dil Raju Over IT Raids

Dil Raju-IT Raids: ఐటీ దాడుల్లో తమ వద్ద భారీగా డబ్బు, పత్రాలు లభ్యమయ్యాయని కొన్ని ఛానెల్స్, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరిగిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తమ వద్ద రూ. 20 లక్షల లోపు మాత్రమే ఉన్నాయని ప్రకటించారు. ఐటీ దాడుల అంశంపై ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. తమ వద్ద అంతా క్లీన్ గా ఉండడం చూసి అధికారులు ఆశ్చర్య పోయారన్నారు. నాలుగు రోజులుగా తమ నివాసాలు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు(IT Raids) నిర్వహించినట్లు చెప్పారు. ఐదు సంవత్సరాల నుంచి తాము ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేదన్నారు. 24 క్రాఫ్ట్స్ లో లావాదేవీల డిటైల్స్ తీసుకున్నారని చెప్పారు.
ఇది కూడా చదవండి: Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ దాడి కేసులో మరో ట్విస్ట్.. ఎవరీ కొత్త వ్యక్తి..?

ఇది కూడా చదవండి: సూపర్ సెల్ తుఫాన్‌తో బ్రెజిల్‌ అతలాకుతలం.. వీడియో వైరల్!

మా అమ్మ ఆస్పత్రిలో చేరింది అందుకే..

లంగ్ ఇన్ఫెక్షన్ కారణంగానే తన తల్లి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారని చెప్పారు. దయచేసి తప్పుడు వార్తలు వేయవద్దని విజ్ఞప్తి చేశారు. తానేమీ టార్గెట్ అవ్వలేదన్నారు. తమ‌ మీద సెర్చ్ జరిగి 18 ఏళ్లు అయిందని.. ఇదంతా ప్రాసెస్ అని స్పష్టం చేశారు. అంతే కానీ ఎక్కువగా ఊహించుకొవద్దని కోరారు. ఇండస్ట్రీ లో అంతా ఆన్ లైన్ బుకింగ్, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరుగుతున్నాయన్నారు. ఇండస్ట్రీ అంతటా రైడ్స్ జరిగాయన్నారు. కలెక్షన్స్ ఎక్కువ చేసి చూపించడం మీద ఇండస్ట్రీ అంతా కూర్చొని మాట్లాడడామన్నారు. అది తప్పు.. తీరు మార్చుకొవాల్సిందేనన్నారు. ఫిబ్రవరి 3న ఐటీ అధికారులు కలవమన్నట్లు చెప్పారు. ఆడిటర్స్ వెళ్లి కలుస్తారన్నారు. 
ఇది కూడా చదవండి: Cinema: సీజ్ ద లయన్ అంటున్న రాజమౌళి..ఎస్ఎస్ఎమ్బీ29 షూటింగ్ మొదలైనట్టేనా?

ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఇప్పట్లో లేనట్లే!

Advertisment
Advertisment
తాజా కథనాలు