Hyderabad Cyber Crime: హైదరాబాద్ వాసికి సైబర్ వల.. రూ.4.31 కోట్లకు టోకరా!
హైదరాబాద్లోని యాప్రాల్కు చెందిన 49 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగి సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడ్డాడు. షేర్ ట్రేడింగ్ పేరుతో పలు దఫాలుగా రూ.4.31 కోట్లు ట్రాన్సఫర్ చేశాడు. అనంతరం సొమ్మును విత్ డ్రా చేసుకోవాలని ప్రయత్నించగా రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.