Cyber Crime : స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పేరుతో మహిళకు టోకరా...రూ.2.7 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
చంపాపేటకు చెందిన 57 ఏళ్ల గృహిణి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.2.7 కోట్లు పోగొట్టుకుంది. సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్ పెట్టుబడి సలహాదారులుగా నటిస్తూ ఆమెనుంచి డబ్బులు కాజేశారు. సంస్థాగత స్టాక్లలో పెట్టుబడి పెట్టమని ఒప్పించి పెద్దమొత్తంలో దోచుకున్నారు.