పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!
పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం ఎదురైంది. హండ్రెడ్ లీగ్-2025 డ్రాఫ్ట్లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఒక్కరు కూడా అమ్ముడుపోలేదు. డ్రాఫ్ట్లో మొత్తం 45 మంది పురుష ఆటగాళ్లు, 5 మంది మహిళా క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా వీరిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.