భారీ వర్షాలకు నీట మునిగిన చెన్నై | Chennai under Heavy Rains | RTV
చెన్నైలోని టీమ్ డీటెయిలింగ్ సొల్యూషన్స్ అనే కంపెనీ తమ ఉద్యోగులకు కార్లు, బైకులు బహుమతులుగా ఇచ్చింది. 28 మందికి కార్లు, మరో 29 మందికి బైక్లు అందించింది. ఉద్యోగులు కంపెనీని విజయపథంలో నడపించినందుకు గుర్తింపుగా ఇలా చేశామని కంపెనీ ఎండీ వెల్లడించారు.
భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం చెన్నైలో జరిగిన ‘మెగా ఎయిర్ షో’లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ షోను చూసేందుకు లక్షలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. 100 మందికిపైగా గాయపడ్డారు.
చెన్నై మెరీనా బీచ్లో దారుణం జరిగింది. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘మెగా ఎయిర్ షో’లో విషాదం చోటుచేసుకుంది. ఈ షోను వీక్షించేందుకు లక్షలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. నలుగురు మృతి చెందగా 100 మందికిపైగా గాయపడ్డారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు. ఆయన గుండెకు సంబంధించి పలు వైద్య పరీక్షలను వైద్యులు మంగళవారం చేయాల్సి ఉండటంతో సోమవారం రాత్రి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఆయన చేరారు.
ఒంగోలు మాజీ ఎంపీ, మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్ను మూశారు.
సమంత ఈరోజు ఒక స్పెషల్ విషయాన్ని చెబుతానని ప్రకటించింది. అందరూ కచ్చితంగా ఆమె పెళ్ళి వార్తే అయి ఉంటుందని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ సమంత మాత్రం వరల్డ్ పికిల్ బాల్ ఫ్రాంచేజీకి యజమానిగా ఉంటున్నా అంటూ ఫోటో షేర్ చేసింది.
బ్రెయిన్ డెడ్ అయిన 11 నెలల పాప గుండెను ఏడాది చిన్నారికి విజయవంతంగా అమర్చిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.ప్రస్తుతం చిన్నారి అవయవాలు దానం చేసిన పాప తల్లిదండ్రులపై ప్రశంసలు వస్తున్నాయి.