Hero Vijay Thalapathy: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించి ఏడాది పూర్తైన సందర్భంగా బుధవారం చెన్నైలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు టీవీకే నేతలతోపాటు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ స్టేజ్‌పై నిలబడి అభిమానులకు అభివాదం చేశారు.

New Update
TVK anniversary celebrations

TVK anniversary celebrations Photograph: (TVK anniversary celebrations)

Hero Vijay Thalapathy: తమిళ్ హీరో విజయ్‌ ఏడాది క్రితం రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించి తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు ఆయన. పార్టీ స్థాపించి ఏడాది పూర్తైన సందర్భంగా బుధవారం చెన్నైలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలతో పోత్తులపై, ప్రచార యాత్రలపై విజయ్ కీలక ఈ సభలో ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ సభకు టీవీకే నేతలతోపాటు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ స్టేజ్‌పై నిలబడి అభిమానులకు అభివాదం చేశారు.

Also Read: మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే?

2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతామని పార్టీని ప్రారంభించిన సమయంలోనే విజయ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల పోటీకి ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహాలు రచిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

Also Read: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!

గత కొన్ని రోజుల క్రితం చెన్నైలో విజయ్‌ను ప్రశాంత్‌ కిషోర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన విజయ్‌కి సూచనలు సలహాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. దేశంలో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిషోర్‌ పనిచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీవీకే పార్టీకి కూడా ఆయన వ్యూహకర్తగా వ్యవహరిస్తుండటంతో.. విజయ్‌ పార్టీపై తమిళనాట అంచనాలు పెరిగాయి.

Also Read: TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు