/rtv/media/media_files/2025/06/17/uF54tQwHuOxAYbcfyaFs.jpg)
maosit killed three relatives of surreded cadres in Chattisgarh
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ గ్రామంలో మావోయిస్టులు ముగ్గురు వ్యక్తులను హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం పెద్దకోర్మ గ్రామంలో జరిగింది. ఇక ఇటీవల దీనేశ్ మొడియం అనే మావోయిస్టు లొంగిపోయాడు. దీంతో అతని కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు.
Also Read: కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..
మృతులు జింగు మొడియం, సోమ మోడియం, అనిల్ మద్విగా గుర్తించారు. హత్య ఘటన జరిగిన తర్వాత మావోయిస్టులు అదే గ్రామంలో హల్చల్ చేశారు. మరో ఏడుగురిపై దాడులు చేశారు. ఇంకో 12 మందిని కిడ్నాప్ చేశారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?