/rtv/media/media_files/2025/04/17/RufojdUi4HAqBAHSG0eI.jpg)
22 Naxalites Arrested In Chhattisgarh
నక్సలిజాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. గత కొంతకాలంగా నక్సలైట్లు, భద్రతా బలగాల మధ్య తరచుగా కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది నక్సలైట్లు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు లొంగిపోయారు. అయితే గురువారం చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మరో 22 మంది నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: 11 ఏళ్ల బాలికపై కీచకుడి అత్యాచారం.. పొలాల్లో నగ్నంగా, తీవ్ర గాయాలతో చిన్నారి
మూడు చోట్ల నుంచి వాళ్ల సామాగ్రిని సీజ్ చేశారు. ఉసూరు పోలీసు స్టేషన్ పరిధిలోని టేకమెట్ల గ్రామం నుంచి ఏడుమంది క్యాడర్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులతో కోబ్రా కమాండోలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే వాళ్లకి నక్సలైట్లు చిక్కారు. బెల్చార్ గ్రామం నుంచి ఆరుగురు నక్సల్స్, కందకర్ల గ్రామం అడవుల నుంచి 9 మంది నక్సల్స్ను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: అమెరికా వెళ్లడం కష్టమే.. నిజం చెప్పినా వీసా రావట్లేదు
రెండు చోట్ల ఆపరేషన్ నిర్వహించిన భద్రతా దళాలు నక్సలైట్లను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుంచి టిఫిన్ బాంబులు, జిలాటిన్ స్టిక్స్, డెటోనేటర్లు, ఎలక్ట్రిక్ వైర్లు, బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మావో కరపత్రాలను, ఇతర సామాగ్రీని కూడా సీజ్ చేశారు. అరెస్టయిన నక్సలైట్లలో 19 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్నవారు ఉన్నారు.
Also Read: కాబోయే అల్లుడితో అత్త జంప్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. అంతా అత్తే చేసిందన్న అల్లుడు
ఇదిలాఉండగా వరుస ఎన్ కౌంటర్లతో వందలాది మంది నక్సల్స్ పిట్టల్లా రాలుతున్నారు. ఇటీవల తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్రలో కాల్పులు నిలిపివేయాలని బహిరంగ లేఖ విడుదల చేశారు. తాము కూడా కాల్పుల విరమణను పాటిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు.
telugu-news | rtv-news | naxalites | chattisgarh