Maoist: చరిత్రలో తొలిసారి.. సుక్మా జిల్లాలో నక్సల్స్ రహిత గ్రామం.. కోటి రూపాయల విరాళం!

ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలోని బడేశెట్టి తొలి నక్సల్ రహిత గ్రామంగా నిలిచింది. తాజాగా ఆ గ్రామానికి చెందిన 11మంది మావోయిస్టులు లొంగిపోవడంతో నక్సల్స్ ఫ్రీ విలేజ్ గా పోలీసులు ప్రకటించారు. ఈ గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. కోటి అందించనుంది.

New Update
maoist

Chhattisgarh Badeshetti first Naxal-free village

Maoist: ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలోని బడేశెట్టిగ్రామ తొలి నక్సల్ రహిత గ్రామంగా నిలిచింది. తాజాగా ఆ గ్రామానికి చెందిన 11 మంది మావోయిస్టులు లొంగిపోవడంతో నక్సల్స్ లేని ఊరిగా నిలిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. కోటి అందించనున్నట్లు వెల్లడించారు.

ఆపరేషన్లు సక్సెస్..

ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన వివిధ ఆపరేషన్లు సక్సెస్ అయినట్లు భద్రతా బలగాలు చెబుతున్నాయి. కోబ్రా కమాండోలు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు 22 మంది నక్సలైట్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. సుక్మాలోని బడేసెట్టి పంచాయతీలో 11 మంది నక్సలైట్లు లొంగిపోయారు. దీంతో ఈ గ్రామ పంచాయతీ పూర్తిగా నక్సల్స్ రహితంగా మారింది. నక్సలైట్లకు మా విజ్ఞప్తి ఏమిటంటే.. వారు మోదీ ప్రభుత్వ లొంగుబాటు విధానాన్ని అవలంబించి, వీలైనంత త్వరగా ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని కోరుతున్నాం అన్నారు. 

'నియ్యాద్ నెల్నార్' పథకం..

బడేశెట్టి పంచాయతీ చాలా కాలంగా నక్సలైట్ల ప్రభావంతో నిండిపోయింది. కానీ ఇప్పుడు 'నియ్యాద్ నెల్నార్' పథకం ద్వారా క్రియాశీల నక్సలైట్లు లొంగిపోయి ప్రధాన స్రవంతిలోకి తిరిగి వస్తున్నారు. ఈ పంచాయతీ నక్సలైట్ల నుంచి పూర్తిగా విముక్తి పొందింది. జిల్లాలో నక్సల్స్ రహితంగా మారిన ఏకైక పంచాయతీ. దీని అభివృద్ధి కోసం ప్రభుత్వం కోటి రూపాయల ప్రత్యేక నిధిని అందజేస్తుంది అని సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు.

Also Read: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు

సుక్మా జిల్లాలో నక్సలిజానికి వ్యతిరేకంగా మరో పెద్ద విజయం సాధించాం. మొత్తం 33 మంది నక్సలైట్లు లొంగిపోయారు. రూ.40 లక్షల రివార్డు  ఉన్న కీలక నేత కూడా లొంగిపోయాడు. నియాద్ నెల్నార్ పథకం సుక్మా జిల్లాలోని 40 గ్రామ పంచాయతీలను నక్సల్ రహితంగా ప్రకటించాలని హోం మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ ప్రాంతాలను నక్సలైట్లకు బలమైన కోటలుగా పరిగణిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలను అమలు చేయడం ఇక్కడ పెద్ద సవాలుగా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం నక్సలైట్లను నిర్మూలించడంలో అక్కడ అభివృద్ధి వేగాన్ని వేగవంతం చేయడంలో బిజీగా ఉందని అధికారులు తెలిపారు.

Also Read: ఫ్యాన్స్‌ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..


chattisgarh | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు