Operation kagar: దండకారణ్యంలో భీకర యుద్ధం.. అగ్రనేతలను చుట్టుముట్టిన 15వేల భద్రతా బలగాలు!

ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా ఛత్తీష్‌గఢ్‌లో హై అలర్ట్ నెలకొంది. 15కిలోమీటర్ల మేర 15వేల మంది భద్రతా బలగాలు దండకారణ్యాన్ని చుట్టుముట్టాయి. మావోయిస్టు అగ్రనేతలంతా ఒకే దగ్గర ఉన్నారనే సమాచారంతో అడవిలోకి చొచ్చుకెళుతున్నాయి. దీంతో కొందరు లొంగిపోతామంటున్నారట.

New Update
26 Maoists Killed in Karreguttalu

26 Maoists Killed in Karreguttalu

Operation kagar: ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా ఛత్తీష్‌గఢ్‌లో హై అలర్ట్ నెలకొంది. 15కిలోమీటర్ల మేర 15వేల మంది భద్రతా బలగాలు దండకారణ్యన్ని చుట్టిముట్టాయి.  మావోయిస్టు అగ్రనేతలంతా ఒకే దగ్గర ఉన్నారనే సమాచారంతో అడవిలోకి చొచ్చుకెళుతున్నాయి. లొంగిపోయేందుకు మాయిస్టులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

మరికొన్ని రోజుల్లోనే...

ఇప్పటికే కొంతమంది అగ్రనేతలు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే 45 వేల మంది భద్రతా బలగాలు దండకారణ్యం నలువైపుల బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేసుకుని అడవిని జల్లెడ పడుతున్నాయి. పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్‌ బస్వరాజ్‌ మరణించడంతో బలగాలకు మరింత ఉత్సహంతో ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే చేధించాల్సివుండగా.. నారాయణపుర్, బీజాపుర్, దంతెవాడల మధ్య దట్టమైన అడవిలోనే మావోయిస్టులున్నారనే సమాచారంతో ముందుకెళ్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఆపరేషన్ కగార్ సక్సెస్ కాబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: SRH VS RCB: చివరి మ్యాచ్ లోనూ అదరగొట్టిన ఎస్ఆర్హెచ్..ఆర్సీబీపై విజయం

మావోయిస్టు అగ్రనేతల్లో గణపతి, మల్లోజుల కోటేశ్వరరావు, తిప్పిరి తిరుపతి, కడారి సత్యనారాయణ, పుల్లూరు ప్రసాద్, మల్లా రాజిరెడ్డిలతోపాటు కేంద్ర కమిటీలో మెజార్టీ సభ్యులు తెలుగు వారే ఉండటం గమనార్హం. కాగా ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితులను తెలంగాణ నిఘా విభాగం పరిశీలిస్తోంది. 

Also Read: Trump VS Harvard: ట్రంప్ కు బిగ్ షాక్..హార్వర్డ్ ప్రవేశాల నిర్ణయానికి చెక్ పెట్టిన జడ్జి

Advertisment
Advertisment
తాజా కథనాలు