Pahalgam Terror Attack : సింధు నదిపై డ్యామ్ కడితే కూల్చేస్తాం : పాక్
పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధుజలాలను అడ్డుకునేందుకు నదిపై భారత్ డ్యామ్ కడితే ఏం చేస్తారని మీడియా ప్రశ్నించింది. దీంతో ఖవాజా ఒకవేళ భారత్ ఆ పని చేస్తే ఎలాంటి కట్టడాలనైనా పాక్ ధ్వంసం చేస్తుందని బదులిచ్చారు.