/rtv/media/media_files/2025/05/05/7nBEVYGnGi92XJUPAIUN.jpg)
BSF to get 16 new battalions, 2 field HQs for Pakistan, Bangladesh borders
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి కాల్పులు జరిగాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ ఈ దాడులకు పాల్పడింది. పూంఛ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్బానీ, అఖ్నూర్, కుప్వారా, బారాముల్లా ప్రాంతాల్లో పాకిస్థాన్ ఈ దాడులు జరిగాయి. దీంతో వెంటనే స్పందించిన భారత భద్రతా బలగాలు పాకిస్థాన్ ఆర్మీ ప్లాన్ను తిప్పికొట్టాయి. దీంతో బార్డర్లో భారత సైన్యం మరింత మోహరించింది. కొత్తగా మరో 16 అదనపు బెటాలియన్లను రంగంలోకి దిగాయి.
Also Read: వీడు భర్త కాదు బండరాయి.. భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తినేశాడు వెధవ!
Also Read : మెగాస్టార్ హీరోయిన్ ఫస్ట్ లుక్.. 'అవని' గా త్రిష సందడి !
BSF To Get 16 New Battalions
పాకిస్థాన్తో పాటు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా భద్రతను మరింత బలోపేతం చేశారు. అయితే పాకిస్థాన్పై దాడి చేసేందుకు గాను సైన్యం మోహరించినట్లు సమాచారం. ఇప్పటికే భారత్-పాక్ సరిహద్దుల్లో 193 బెటాలియన్లు మోహరించాయి. ఒక్కో బెటాలియన్లోనే ఏకంగా వెయ్యి మందికి పైగా సైనికులు ఉన్నారు.
మరోవైపు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్థాన్కు మరో వార్నింగ్ ఇచ్చారు. దేశంపై దాడి చేసినాళ్లకి గట్టి సమాధానం చెబుతామన్నారు. ప్రధాని పనితనం, పట్టుదల గురించి ప్రజలకు తెలుసన్నారు. చైనాతో కలిసి ఇండియాతో కుట్రకు పాల్పడేవాళ్లకు ఊహించని విధంగా సమాధానం ఇస్తామన్నారు. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో పాకిస్థాన్లో ఏజెన్సీలు, దళాలు హై అలర్ట్లో ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read: కీలక అప్డేట్.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన మరో టెర్రరిస్ట్ అరెస్టు
పాకిస్థాన్కు మరో బిగ్షాక్ తగిలింది. ముస్లిం దేశాలు పాక్ను ఏకాకి చేశాయి. ఆ దేశానికి మద్దతు ఇచ్చేందుకు ముస్లిం దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ ఇండియా వైపే ఉన్నాయి. భారత్తో ఆ దేశాలకు బలమైన వ్యాపార సంబంధాలు ఉండటమే దీనికి కారణం. అయితే ఏకపక్షంగా పాకిస్థాన్కు సపోర్ట్ ఇచ్చేందుకు సౌదీ నిరాకరించింది.
Also Read : ప్రయాణికులకు బిగ్ షాక్.. మెట్రో చార్జీల పెంపు- కొత్త ధరలు ఇవే!
national news in Telugu | rtv-news | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu