🔴Live Breakings: ఆరోగ్య శ్రీ రూల్స్ మార్పు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
అన్నమయ్య జిల్లాలో కడప క్రాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో స్పాట్లోనే లారీ డ్రైవర్లు ఇద్దరూ దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
బీసీలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రూ.20 వేల అదనపు సబ్సీడీ అందిస్తామని ప్రకటించారు. దీంతో 2కిలో వాట్ల రూఫ్టాప్ కు రూ.80 వేల వరకు సబ్సిడీ అందుతుంది.
ఏపీ ఇంటర్మీడియట్ విద్యలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇంటర్ మ్యాథ్స్ ఎ, బి ఒకే సబ్జెక్ట్గా.. బోటనీ, జువాలజీ ఒకే సబ్జెక్ట్గా పరిగణించాలన్నారు. ఇకపై ఏటా ఫిబ్రవరి ఆఖరివారం నుంచే ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
పోసాని కృష్ణ మురళికి ఊహించని షాక్ ఎదురైంది. జైలు నుంచి పోసాని కృష్ణ మురళి విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ఈ రోజు పోసానిని విడుదల చేసే అవకాశం ఉందని నిన్నటి నుంచే ప్రచారం జరిగింది.
కాకినాడ జిల్లా ఎక్సైజ్ సిబ్బంది అత్యుత్సాహం ఒక యువకుడి నిండు ప్రాణం తీయగా,మరో యువకుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మద్యం ఉందన్న అనుమానంతో ఎక్సైజ్ పోలీసులు బైక్ను వెంబడించగా ఎదురుగా వస్తున్నలారీ ఢీకొని ఓ విద్యార్థి చనిపోగా, మరోకరు గాయపడ్డారు.
రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. వచ్చే క్యాబినెట్ నాటికి టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ తెస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.
మాజీ మంత్రి విడదల రజనీ చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలుచేశారన్న ఆరోపణలతో రజనీ, ఐపీఎస్ జాషువాపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది.