Air India Plane Cr*ash | 30 సెకన్లు 300 ప్రా*ణాలు.. అసలేం జరిగింది? | Plane Cr*ash | Ahmedabad | RTV
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. టేకాఫ్ సమయంలో విమానంలో 242 మంది ఉన్నారని వెల్లడించింది. 24 మంది మెడికల్ విద్యార్థులతో కలిపి మొత్తం 265 మంది మరణించారు.
ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. లండన్ వెళ్తున్న విమానం గురువారం మధ్యాహ్నం గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని మేఘనినగర్లో కూలిపోయింది.
రాజస్థాన్కు చెందిన ఖుష్బూకు ఈ మధ్యనే పెళ్లయింది. ఆమె భర్త లండన్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో భర్తను కలుసుకునేందుకు ఖుష్బూ బయలు దేరింది. పెళ్లి తర్వాత తొలిసారి తన భర్తను కలిసేందుకు వెళ్తూ విమాన ప్రమాదంలో మృతి చెందింది.
ఎయిర్ ఇండియా ప్రమాదం మనదేశంతో పాటు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రమాదంలో సుమారు 240 మందికి పైగా మరణించడం అందరినీ కలిచివేసింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం పై ప్రపంచ దేశాలన్ని తమ సంతాపాన్ని తెలియ జేస్తున్నాయి.
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా ప్రాణాలతో భయటపడితే అది ఒక అద్భుతమే అని నిపుణులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు టేకాఫ్ ఐన విమానం మధ్యాహ్నం 1:38 గంటలకు అంటే 8 నిమిషాల్లోనే కుప్పకూలింది.
గుజరాత్ అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఫ్లయిట్ ఏఐ-171 టేకాఫ్ తీసుకున్న ఐదు నిమిషాలకే కుప్పకూలింది. ఈ సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది.