/rtv/media/media_files/2025/06/13/recF6JkHqO2HTsotsQ3Q.jpg)
Ahmedabad Plane Crash
Ahmedabad Plane Crash: గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ విమానం లండన్కు వెళ్తుండగా ఈ ఘోర జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 265 మంది ప్రాణాలు కోల్పోయారు. గంటల తరబడి సహాయక చర్యలు కొనసాగాయి, గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
విమానం ఢీకొన్న వెంటనే ట్యాంక్ పేలిపోయి మంటలు:
విమానం కూలిపోయిన తర్వాత విమానం లోపల, చుట్టుపక్కల ఉష్ణోగ్రత దాదాపు 1,000 డిగ్రీల సెల్సియస్కు చేరుకుందని అధికారులు తెలిపారు. అందువల్ల సహాయక చర్యలు చేపట్టడం కష్టతరంగా మారిందని అధికారులు తెలిపారు. విమానం ఢీకొన్న వెంటనే ట్యాంక్ పేలిపోయి మంటలు చెలరేగాయని అగ్నిమాపక దళ సీనియర్ అధికారి తెలిపారు. దీని కారణంగా కొన్ని క్షణాల్లో ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. ఉష్ణోగ్రత చాలా పెరిగి ఎవరూ తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు.
ఇది కూడా చదవండి: ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..? ఓ అధ్యయనంలో చెప్పిన షాకింగ్ నిజాలు..!!
మరో ఎస్డీఆర్ఎఫ్ అధికారి మాట్లాడుతూ.. ఉష్ణోగ్రత చాలా పెరిగిందని.. ఆ ప్రదేశంలో ఉన్న కుక్కలు, పక్షులు కూడా దాని బారిన పడ్డాయని.. వాటికి తప్పించుకునే అవకాశం లభించలేదని అన్నారు. ఏఏఐబీతో సహా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశాయి.
ఇది కూడా చదవండి: ఉత్సాహంగా ఉండటానికి ప్రతిరోజూ ఈ రసం తాగండి... ఎగిరి గంతులేస్తారు!
( ahmedabad plane crash 2025 | ahmedabad plane crash news Latest News)