Air India Plane Crash : భార్య చివరి కోరిక తీర్చి...తిరిగి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..

అహ్మదాబాద్‌లో విమానం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మరణించినవారిలో అమ్రేలీకి చెందిన అర్జున్‌ భాయ్‌ కూడా ఉన్నారు. ఆయన తన భార్య చివరి కోరిక మేరకు ఆమె అస్థికలు నిమజ్జనం చేయడానికి భారత్‌కు వచ్చారు. తిరిగివెళ్తూ ప్రమాదంలో మరణించడంతో పిల్లలు అనాథలయ్యారు.

New Update
Air India Plane Crash

Air India Plane Crash

Air India Plane Crash :  అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే.  కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. మరణించినవారిలో అమ్రేలీకి చెందిన అర్జున్‌ భాయ్‌ కూడా ఉన్నారు. ఆయన తన భార్య చివరి కోరిక మేరకు ఆమె అస్థికలు నిమజ్జనం చేయడానికి భారత్‌కు వచ్చారు. అన్ని కార్యక్రమాలు ముగించుకొని తిరిగి లండన్‌కు వెళ్తుండగా విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. అయితే తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో వారి పిల్లలు అనాథలయ్యారు.  

 అమ్రేలీ జిల్లాకు చెందిన అర్జున్‌భాయ్ మనుభాయ్ పటోలియా లండన్‌లో స్థిరపడ్డారు. భార్య తన ఇద్దరు పిల్లలలో సంతోషంగా గడచిపోతున్న వారి జీవితంలో అనుకోని సంఘటన విషాదన్ని నింపింది. ఆయన భార్య లండన్‌లో అర్థంతరంగా చనిపోయారు. అయితే ఆయన భార్య చివరికోరిక మేరకు ఆమె అస్థికలను స్వగ్రామంలో నిమజ్జనం చేయాలనుకున్నారు. అనుకున్నట్లే ఆయన అస్థికలను తీసుకుని ఇండియా వచ్చారు. పిల్లలను మాత్రం లండన్‌లోనే వదిలేశారు. స్వగ్రామానికి వచ్చిన అర్జున్‌ తన బంధువుల సమక్షంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. అనంతరం లండన్‌కు తిరిగి ప్రయాణమయ్యారు. గురువారం జరిగిన ఎయిర్ ఇండియా- విమాన ప్రమాదంలో అర్జున్ మరణించారు.

ఈ విషయం తెలిసి అర్జున్‌భాయ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అర్జున్‌ తండ్రి గతంలోనే చనిపోయారు. తల్లి ప్రస్తుతం సూరత్‌లో ఉంటున్నారు. ఆయన పిల్లలు లండన్‌లో ఉండిపోయారు. ఈ విషయం తెలిసి వారు శోకసముద్రంలో మునిగిపోయారు. ఇప్పటికే తల్లిని కోల్పోయి దుంఖంలో ఉన్న వారికి తండ్రిని దూరం చేసి విధి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు