Plane Crash: విమానంలో ఎక్కడ కూర్చుంటే సేఫ్‌నో తెలుసా?

అహ్మదాబాద్‌లోని మేఘని నగర్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం తర్వాత చాలా మందిలో ఒక అనుమానం రావడం సహజం. అదెంటంటే అసలు విమానంలో ఎక్కడ కూర్చుంటే ప్రమాదాలు జరిగినా రక్షణ ఉంటుంది అని.

author-image
By Madhukar Vydhyula
New Update
Air India

Plane Crash

Plane Crash: అహ్మదాబాద్‌లోని మేఘని నగర్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్‌ పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయిన ఐదు నిమిషాల వ్యవధిలోనే విమానం సమీపంలోని మెడికల్‌ కాలేజీ హాస్టల్‌పై కూలింది. ప్రమాదంలో విమానంలో ఉన్న వారితో పాటు హాస్టల్‌లో ఉన్న మెడికల్‌ స్టూడెంట్స్‌ కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం తర్వాత చాలా మందిలో ఒక అనుమానం రావడం సహజం. అదెంటంటే అసలు విమానంలో ఎక్కడ కూర్చుంటే ప్రమాదాలు జరిగినా రక్షణ ఉంటుంది అని.

ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో ఏ భాగంలో కూర్చున్న వారు సురక్షితంగా ఉంటారనే అనుమానాలు వస్తుంటాయి. విమానంలో ముందు భాగంలో కూర్చేంటే సేఫ్‌గా ఉంటామా? వెనుక తోక భాగంలో కూర్చుంటే బెటరా? లేక మధ్య భాగంలో సీటు బుక్‌ చేసుకుంటే మంచిదా? అని అందరూ ఆలోచిస్తారు.  విమానంలో బిజినెస్‌ క్లాస్‌, ఎకానమీ అంటూ అనేక విభాగాలు ఉంటాయి. బిజినెస్‌ క్లాస్‌ టికెట్లు ఎక్కువ ధరతో పాటు , ఎక్కువ సౌకర్యాలతో కూడుకుని ఉంటాయి. ఎకానమీ క్లాస్‌లో తక్కువ ధరకు టిక్కెట్లు లభిస్తాయి.  అయితే అత్యంత సురక్షితంగా విమానంలో ప్రయాణంచాలంటే  ఏ సీటును బుక్ చేసుకోవాలో అనే ప్రశ్న అందరి మనస్సులో తలెత్తుతున్నది. ఈ  నేపథ్యంలో పలు నివేదికలు, పలు సర్వేలు  తెలిపిన వివరాలు ఏం చెబుతున్నాయంటే...

చాలామందికి బస్సులోనే వెనుక కూర్చోవడం అంటే అంతగా నచ్చదు. విమానం అయినా అంతే. చాలామందికి వెనుక కూర్చోవడం ఇష్టం ఉండదు.దాంతో పాటు సీట్లో ఆ చివర ఈ చివర ఒకే కానీ మధ్య సీట్లలో కూర్చోవడం చాలామందికి నచ్చదు. అయితే గత 35 ఏండ్ల విమాన ప్రమాదాల డాటాను పరిశీలిస్తే  విమాన ప్రమాదాల్లో వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికుల మరణాల రేటు తక్కువగా ఉందని తేలింది.అంటే ఆ ప్రాంతంలోని చాలా మంది ప్రయాణీకులు బతికే అవకాశం ఉంది. కనుక వెనుక సీటు అని మొహమాట పడకుండా వెనుక సీట్లో కూర్చోవడమే సురక్షితమైని సర్వేలు చెబుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు