/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
Accident
కాకినాడ జిల్లా తునిలో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టడంతో స్పాట్లోనే ముగ్గురు ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. రాజమహేంద్రవరం అపోలో ఫార్మసీకి చెందిన ఉద్యోగులుగా గుర్తించారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Oppo Reno 14 5G Series: కిర్రాక్ మావా.. అప్పు చేసైనా ఒప్పో కొనేయాల్సిందే - ఫోన్లు అదిరిపోయాయ్!
యూపీలో బాత్రూమ్..
ఇదిలా ఉండగా ఇటీవల ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. బాతురూమ్లో టాయిలెట్ సీటు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఊహించన ఘటనలో 20 ఏళ్ల యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని హాస్పిటల్కు తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతకీ టాయిలెట్ సీటు ఎందుకు పేలింది?.. అలా బ్లాస్ట్ కావడానికి గల కారణం ఏంటి? అనే విషయానికొస్తే..
ఇది కూడా చూడండి: Russia-Ukraine: రష్యా వీలు కాని డిమాండ్లు పెడుతోంది.. ఉక్రెయిన్ ఆరోపణ
20 ఏళ్ల అషు అనే యువకుడు తన ఫ్యామిలీతో కలిసి ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో సెక్టార్ 36లో నివసిస్తున్నాడు. ఇక రోజులాగానే ఉదయం లేచి ఇంట్లో ఉన్న వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్కు వెళ్లాడు. లోపలికి వెళ్లి ముందుగా ఫ్లష్ బటన్ నొక్కాడు. దీంతో ఒక్కసారిగా టాయిలెట్ సీటు భారీ శబ్దంతో బ్లాస్ట్ అయింది. వాష్ రూమ్ మొత్తం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అషు ముఖం, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.
ఇది కూడా చూడండి: Pre-Diabetes: ప్రీడయాబెటిస్, ఊబకాయం ఉన్నవారు కొన్ని పండ్లను ఎందుకు నియంత్రణలో తినాలి
పేలుడు శబ్ధం విన్న కుటుంబ సభ్యులు వెంటనే అషును హాస్పిటల్కు తరలించారు. గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్కు అతడిని తీసుకెళ్లారు. అషుకు ఈ ప్రమాదంలో దాదాపు 35 శాతం కాలిన గాయాలు అయినట్లు డాక్టలు తెలిపారు.
ఇది కూడా చూడండి: RCB VS KKR: జోష్ మళ్ళీ మొదలు..ఈరోజు నుంచి ఐపీఎల్ రీస్టార్ట్