/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
Accident
జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ బొలేరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన బస్స్టాప్లో నిలబడి ఉన్న నర్సింగ్ విద్యా్ర్థినులపై ఆ వాహనం దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో ఇద్దరు విద్యార్థినులు అక్కడిక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గద్వాల జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కాలేజీకి చెందిన విద్యార్థినులు తమ హాస్టల్కు వెళ్లేందుకు కొత్త హౌసింగ్ బోర్డ్ టర్నింగ్ బస్స్టాప్ వద్ద వేచి ఉన్నారు.
Also Read: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా, ఏకిపారేయ్యండి .. ప్రధాని మోదీ సంచలనం
దీంతో ఒక్కసారిగా బొలేరో వాహనం దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు విద్యార్థినులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వాళ్లని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ల పరిస్థితి విషయమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థినులు మక్తల్కు చెందిన మహేశ్వరి, వనపర్తికి చెందిన మనీషా శ్రీగా గుర్తించారు.
Also Read: పాకిస్థాన్కు షాక్.. ఇజ్రాయెల్ సాయంతో భారత్ సరికొత్త ప్లాన్ !
అయితే ఆ బొలెరో వాహనం డ్రైవర్ మత్తులో ఉన్నాడని అక్కడున్న స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అతడు వెంటనే పరారైనట్లు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గద్వాల ఎమ్మెల్యే, కలెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆదేశించారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థినులకు వైద్యసాయం అందించాలని కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు.
Also Read: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా.. జస్టిస్ బీర్ గవాయ్ నియామకం..
telugu-news | rtv-news | accident | telangana