Simhachalam Temple Incident: సింహాచలం ఘటనపై పీఎం మోదీ దిగ్భ్రాంతి..2 లక్షల పరిహారం

సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన బాధిత కుటుంబాలకు 2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. 

New Update
PM Modi

PM Modi

Simhachalam Temple Incident: సింహాచలం ఘటనపై పీఎం మోదీతో(PM Modi) సహా పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. అలాగే అటు కోలకత్తా ఘటనపైనా మోదీ స్పందించారు.  అందులో మృతుల కుటుంబాలకు కూడా రూ. 2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ. 50 వేలు ఇస్తామని చెప్పారు. 

Also Read: Akshaya Tritiya 2025 నేడు అక్షయ తృతీయ.. బీరువాలో ఈ ఒక్కటి ఉంచితే డబ్బులే డబ్బులు

నేతల స్పందన..

ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేశ్ లతో పాటూ వైసీపీ అధినేత జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు కూడా స్పందించారు. సింహాచలం దుర్ఘటన దురదృష్టకరమని పవన్ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. విశాఖ జిల్లా అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నామని...గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించామని పవన్ కల్యాణ్ చెప్పారు.  ఇక ఈ ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని మంత్రి లోకేశ్ అన్నారు. గాయపడిన వారికి ప్రస్తుతం కేజీహెఛ్ లో వైద్యం చేస్తున్నారని...అవసరమైతే వారిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశించామని తెలిపారు. 

Also Read: Jammu and Kashmir: లోయలో పడిపోయిన CRPF జవాన్ల వాహనం

ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింహాచలం ప్రమాదం ఘటనపై విచారం వ్యక్తం చేశారు. గోడ కూలి అంతమంది చనిపోవడం తనకు ఆవేదన కలిగించిందని ఆయన అన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు రేవంత్.

ప్రమాదంపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అప్పన్న స్వామి దర్శనానికి వెళ్ళి భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 

Also Read: Iphone 17 Series: ఐఫోన్ 17 ప్రో నుంచి కిర్రాక్ అప్డేట్.. ధర, లాంచ్, డిజైన్, కలర్ - ఫుల్ డీటెయిల్స్ ఇవే!

today-latest-news-in-telugu | pm modi | simhachalam Chandanotsavam accident 

Also Read: J&K: ఒకవైపు నీతి కబుర్లు...మరోవైపు సరిహద్దుల్లో కాల్పులు..ఈరోజు కూడా..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు