KTR: నన్ను జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటా: కేటీఆర్
రేవంత్ జైలుశిక్ష అనుభవించారు కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టించి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఒకవేళ నన్ను జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటానని పేర్కొన్నారు.
రేవంత్ జైలుశిక్ష అనుభవించారు కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టించి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఒకవేళ నన్ను జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటానని పేర్కొన్నారు.
కాళేశ్వరం ఇంజినీర్ నూనె శ్రీధర్ని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. శ్రీధర్ ఇంట్లో ACB రైడ్స్ నిర్వహించింది. దాదాపు రూ.150 కోట్లకు పైగా అక్రమాస్తులు ఏసీబీ అధికారులు గుర్తించారు. 13 ప్రాంతాల్లో సోదాలు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఆయనకు మరోసారి నోటీసులు అందాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు.
తెలంగాణలో అత్యంత సంచలనంగా మారిన గొర్రెల స్కాం కేసులో కీలక పరిణామం నెలకొంది. కేసులోమొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ1 నిందితుడు మొయినుద్దీన్ను శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
అజారుద్దీన్ కి హైకోర్టులో ఊరట లభించింది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్కి అజారుద్దీన్ పేరు తొలగించవద్దని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ క్రికెట్ సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ భుక్యా హరిరామ్ను ఏసీబీ అరెస్టు చేసింది. శనివారం రాత్రి వరకూ గుర్తించిన అక్రమాస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు.
భద్రాది కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం సీఐ ఏసీబీకి దొరికి 10 రోజుల్లోనే మరో సీఐ రూ.లక్ష లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. భూవివాదంలో సెటిల్మెంట్ చేసికి సీఐ సతీష్ కుమార్ డీల్ కుదుర్చుకున్నాడు. అతని అనుచరుడు జర్నలిస్ట్ డబ్బులు తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.
ఏపీలో ఓ పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ రూ.20 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. దొంతమూరు కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు నుంచి ఓ కేసు విషయంలో డబ్బు డిమాండ్ చేశాడు.
మాజీ మంత్రి విడదల రజనీ చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలుచేశారన్న ఆరోపణలతో రజనీ, ఐపీఎస్ జాషువాపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది.