/rtv/media/media_files/2025/06/11/zya1fXx7F5O8dC3silqh.jpg)
కాళేశ్వరం ఇంజినీర్ ఈఈ నూనె శ్రీధర్ని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. శ్రీధర్ ఇంట్లో ఏసీబీ బుధవారం రైడ్స్ నిర్వహించింది. దాదాపు రూ.150 కోట్లకు పైగా ఆయనకు ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 13 ప్రాంతాల్లో సోదాలు చేయగా.. స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. భారీగా బంగారం, డైమండ్స్, ప్లాటినం ఆభరణాలు, కార్లు సీజ్, విల్లాలు, బయటపడ్డాయి.
Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !
Also Read: సోనమ్ మామూల్ది కాదయ్యా ..భర్తను చంపి ఫేస్బుక్లో పోస్టు.. హనీమూన్ కేసులో బిగ్ ట్విస్ట్!
Kaleshwaram EE To Chenchalguda Jail
కరీంనగర్, వరంగల్, హైదరాబాద్లో కమర్షియల్ బిల్డింగ్స్, 19 ఓపెన్ ప్లాట్లు, 16 ఎకరాల భూమి, అపార్ట్మెంట్స్ ఉన్నట్లు తేలింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ గాయత్రి పంప్హౌస్ నిర్మాణంలో నూనె శ్రీధర్ ఇన్చార్జిగా వ్యవహరించారు. కాంట్రాక్టర్ల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిన్న కాళేశ్వరం విచారణకు కేసీఆర్ వచ్చి వెళ్లగానే ఇంజినీర్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నూనె శ్రీధర్ కరీంనగర్ జిల్లా చొప్పదండి డివిజన్ ఈఈగా పనిచేస్తున్నారు. కుమారుడి పెళ్లికి అతిథులను విమానంలో థాయ్లాండ్కు తరలించిట్లు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ACB ఆయన్ని అరెస్టు చేసింది.
Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్పై కీలక నిర్ణయం!
Also Read: ఈ నెలలోనే అమెరికా, భారత్ మధ్యంతర డీల్..500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం
latest-telugu-news | ee | kaleshwaram barrage | kaleshwaram case | Chanchalguda jail | Noone Sridhar | Kaleshwaram EE