/rtv/media/media_files/2025/11/18/mro-office-2025-11-18-21-29-55.jpg)
పవిత్రమైన అయ్యప్ప మాల(Ayyappa Mala) ధరించి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు(Bribe Case) తీసుకుంటూ దొరికిపోయారు. సర్వేయర్ రూ.1లక్ష లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ(acb-raid)కి రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. హైదరాబాద్ – సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయం(Hyderabad MRO office)లో అయ్యప్ప మాల వేసిన సర్వేయర్, అతని సహచరుడు పాపానికి ఒడిగట్టారు. అయ్యప్ప మాలలో ఉన్నాం.. ఎవరూ అనుమానించరులే అని భావించి వసూళ్లకు పాల్పడ్డారు. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు దాడి చేయడంతో పట్టుబడ్డారు.
Also Raed : లవర్ వదిలేసి వెళ్లాడని.. ఇద్దరు పిల్లల తల్లి సూసైడ్
Surveyor Caught By ACB
రూ.1లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సర్వేయర్
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2025
హైదరాబాద్ – సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో రూ. 1 లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్ కిరణ్, అతని సహచరుడు భాస్కర్
ఇద్దరు ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని, అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు pic.twitter.com/21CLqftMqK
దీంతో వీరి భాగోతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయప్ప మాల ధరించి అవినీతికి పాల్పడతారా అంటూ నెటిజన్లు, స్వామి భక్తులు ఫైర్ అవుతున్నారు. సర్వేయర్ కిరణ్, అతని సహచరుడు భాస్కర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి అధికారులకు చిక్కారు. ఏసీబీ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Also Read : ఘోర బస్సు ప్రమాదం.. డివైడర్ను ఢీకొట్టి బోల్తా - 25 మంది స్పాట్లోనే..!
Follow Us