ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బుధవారం ఏసీబీకి లేఖ రాశారు. విచారణలో పర్సనల్ ఫోన్ సమర్పించాలని ఏసీబీ కేటీఆర్కు నోటీసులకు పంపింది. ఏసీబీ అధికారుల నోటీసులకు కేటీఆర్ బదులుగా లేఖలో సమాధానం ఇచ్చారు. విచారణలో ఫోన్ ఇవ్వడం అంటే.. ప్రాథమిక హక్కులకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా గతంలో ఇదే చెప్పిందని ఆయన గుర్తు చేశారు.
విచారణలో అధికారులు అడిగిన అన్ని రకాల ప్రశ్నలకు సమాధానం చెప్పానని కేటీఆర్ తెలిపారు. ఏసీబీ ఇచ్చిన నోటీసుల్లో ఫోన్ ఎందుకు సమర్పించాలనే కారణం, ఉద్దేశం లేదని స్పష్టంగా లేదని బీఆర్ఎస్ లీడర్ ప్రశ్నించారు. ఫార్ములా కేసు విచారణ అధికారిక పత్రాలు, రికార్డులు మున్సిపల్ శాఖ వద్దే ఉన్నాయని కేటీఆర్లో పేర్కొన్నారు. గతంలో వాడిన ఫోన్ నా దగ్గర లేదని కేటీఆర్ ఏసీబీకి చెప్పారు.