KTR: నన్ను జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటా: కేటీఆర్
రేవంత్ జైలుశిక్ష అనుభవించారు కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టించి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఒకవేళ నన్ను జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటానని పేర్కొన్నారు.
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్పై సోమవారం ఏసీబీ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. ఈరోజు జరిగిన విచారణకు సెల్ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ తెలిపారు. ఈ రేసు నిర్వహించిన సమయంలో కేటీఆర్ వాడిన సెల్ఫోన్లు అప్పగించాలని అధికారులు ఆయనకు ఆదేశించారు. జూన్ 18లోపు సెల్ఫోన్లు అప్పగించాలని స్పష్టం చేశారు.
విచారణ జరిగిన తర్వాత కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.'' రేవంత్ అసెంబ్లీలో ఈ కార్ రేసింగ్పై చర్చిద్దామంటే పారిపోయారు. నేను లై డిటెక్టర్ పరీక్షకు కూడా రెడీ అని చెప్పా. అయినా పత్తా లేకుండా పోయారు. ఈరోజు జరిగిన ఏసీబీ విచారణలో ఒకటే ప్రశ్నను తిప్పి తిప్పి అడిగారు. ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందని నేను వాళ్లను అడిగాను.
పైనుంచి రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీబీ అధికారులు అడిగారు. రేవంత్ జైలుశిక్ష అనుభవించారు కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టించి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారు. ఒకవేళ నన్ను జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటా. నాపై వందల కొద్ది కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా భయపడేది లేదని'' కేటీఆర్ అన్నారు.
KTR: నన్ను జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటా: కేటీఆర్
రేవంత్ జైలుశిక్ష అనుభవించారు కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టించి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఒకవేళ నన్ను జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటానని పేర్కొన్నారు.
If they put me in jail, I will take a rest, Says KTR
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్పై సోమవారం ఏసీబీ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. ఈరోజు జరిగిన విచారణకు సెల్ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ తెలిపారు. ఈ రేసు నిర్వహించిన సమయంలో కేటీఆర్ వాడిన సెల్ఫోన్లు అప్పగించాలని అధికారులు ఆయనకు ఆదేశించారు. జూన్ 18లోపు సెల్ఫోన్లు అప్పగించాలని స్పష్టం చేశారు.
Also Read: రైతులకు గుడ్న్యూస్.. రేపే రైతుభరోసా నిధులు జమ
విచారణ జరిగిన తర్వాత కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.'' రేవంత్ అసెంబ్లీలో ఈ కార్ రేసింగ్పై చర్చిద్దామంటే పారిపోయారు. నేను లై డిటెక్టర్ పరీక్షకు కూడా రెడీ అని చెప్పా. అయినా పత్తా లేకుండా పోయారు. ఈరోజు జరిగిన ఏసీబీ విచారణలో ఒకటే ప్రశ్నను తిప్పి తిప్పి అడిగారు. ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందని నేను వాళ్లను అడిగాను.
Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!
పైనుంచి రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీబీ అధికారులు అడిగారు. రేవంత్ జైలుశిక్ష అనుభవించారు కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టించి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారు. ఒకవేళ నన్ను జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటా. నాపై వందల కొద్ది కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా భయపడేది లేదని'' కేటీఆర్ అన్నారు.
Also Read: మమ్మల్ని తీసుకెళ్లండి ప్లీజ్.. ఇరాన్లో భయాందోళనలో భారతీయ విద్యార్థులు
Also Read: ముస్లిం దేశాలపై ఇజ్రాయెల్ యుద్ధం.. నెక్స్ట్ పాకిస్థాన్పై దాడులు !