PM Modi: ఆట అయినా...యుద్ధమైనా...విజయం మనదే..ప్రధాని మోదీ
ఆసియా కప్ 2025లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. అది కూడా పాకిస్తాన్ మీద. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడైనా విజయమం మనదే అంటూ ఆటగాళ్ళకు అభినందించారు.
ఆసియా కప్ 2025లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. అది కూడా పాకిస్తాన్ మీద. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడైనా విజయమం మనదే అంటూ ఆటగాళ్ళకు అభినందించారు.
మనవాళ్ళు కాస్త టెన్షన్ పెట్టినా చివరకు పరువు నిలబెట్టారు. పాకిస్తాన్ ను ఫైనల్ లో ఓడించి కప్ ను సొంతం చేసుకున్నారు. భారత్ బ్యాటర్లలో తిలక్ వర్మ, సంజూ శాంసన్, దూబేలు నిలబడి మరీ మ్యాచ్ ను గెలిపించారు. దీంతో ఆసియా కప్ మన సొంతం అయింది.
పాకిస్తాన్ ఓపెనర్లు ఫర్హానా, ఫఖర్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. మంచి కంబ్యాక్ ఇచ్చారన్న సమయంలో పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ ఔటయ్యారు. 84 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి వేసిన 9.4 ఓవర్కు ఫర్హాన్ (57) తిలక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
పాకిస్తాన్ బ్యాటింగ్ కు అడ్డకట్ట పడింది. ఓపెనర్ల జోరుకు భారత బౌలర్లు కామా పెట్టారు. వేగంగా పరుగులు చేస్తూ రెచ్చిపోతున్న పర్హాన్ ను వరుణ్ పెవిలియన్ కు పంపించాడు.
BSNL చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్ను ప్రకటించింది. రూ.225కి ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకుంటే.. అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్, రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు పొందుతారు. 350కి పైగా లైవ్ టీవీ ఛానెల్లు, OTT యాప్లకు యాక్సెస్ను అందిస్తుంది.
ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఇవాళ భారత్ vs పాకిస్తాన్ జట్ల మధ్య రసవత్తరమైన ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ బ్యాటింగ్కు దిగింది.
ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. 1984 టోర్నీ టైటిల్ పోరును లెక్కిస్తే.. ఇది 41 ఏళ్ల తర్వాత జరుగుతున్న చారిత్రక ఘట్టం. ఈ మ్యాచ్ దుబాయ్లో జరగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది.
భారత్ vs పాకిస్తాన్ మధ్య ఇవాళ ఫైనల్ పోరు జరగనుంది. ఆసియా కప్ 2025 ఫైనల్ గెలిచిన జట్టుకు సుమారు రూ.2.6 కోట్లు ప్రైజ్ మనీ లభిస్తుంది. రన్నరప్ జట్టుకు దీనిలో సగం అంటే సుమారు రూ.1.3 కోట్లు దక్కుతాయి.
ఆసియా కప్లో భారత్, పాక్ మధ్య నేడు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ను లైవ్ ఇచ్చేందుకు పీవీఆర్ ఐనాక్స్ రెడీ అయ్యింది. ఈ మ్యాచ్ కోసం దేశవ్యాప్తంగా 100 స్క్రీన్లను సిద్ధం చేసింది.