Asia Cup 2025 final match: భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్.. పీవీఆర్ ఐనాక్స్‌లో 100 థియేటర్లలో లైవ్!

ఆసియా కప్‌లో భారత్, పాక్ మధ్య నేడు ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. రాత్రి 8 గంటలకు దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌ను లైవ్‌ ఇచ్చేందుకు పీవీఆర్‌ ఐనాక్స్‌ రెడీ అయ్యింది. ఈ మ్యాచ్ కోసం దేశవ్యాప్తంగా 100 స్క్రీన్‌లను సిద్ధం చేసింది.

New Update
ind vs pak

ind vs pak

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ చెప్పక్కర్లేదు. ఆ తర్వాత పహల్గామ్ ఎటాక్ జరిగాక పాక్‌తో ఇక మ్యాచ్‌లు వద్దని బాయ్‌కాట్ ట్రెండింగ్ అయ్యింది. కానీ చివరకు ఆసియా కప్‌లో పాక్‌తో భారత్‌ మ్యాచ్‌లు ఆడుతుందని బీసీసీఐ తెలిపింది. అయితే  c

ఇది కూడా చూడండి: Asia Cup 2025: అభిషేక్ శర్మ ఉండగా.. ఇంకా భయమేందుకు? ఫైనల్ మ్యాచ్‌పై జోస్యం చెప్పిన మాజీ క్రికెటర్

ఇది కూడా చూడండి: Asia Cup 2025 IND vs PAK Final match: పాక్‌తో తలపడే భారత్ ఫైనల్ జట్టు ఇదే?

లైవ్ ఇవ్వనున్న పీవీఆర్ ఐనాక్స్

పీవీఆర్ ఐనాక్స్ ఆసియా క్రికెట్ కౌన్సిల్, ఐటీడబ్ల్యూ యూనివర్స్‌తో కలిపి లైవ్ ఇవ్వనుంది. భారత్, పాక్ మ్యాచ్ అంటే అభిమానులు అన్ని పనులు మానుకుని మరి టీవీ ముందు కూర్చుంటారు. ఎలాంటి యాడ్‌లు లేకుండా స్టేడియం టూ స్క్రీన్ లైవ్ ఇవ్వనుంది. ఈ విషయాన్ని పీవీఆర్‌ ఐనాక్స్‌ డిజిటల్ ప్రతినిధి ఆమీర్ బిజ్లి వెల్లడించారు. ఇలా లైవ్ చూడటం వల్ల క్రికెట్ అభిమానులు స్టేడియంలో ఉన్నట్లే  ప్రతి క్షణం కూడా ఆస్వాదిస్తారని భావిస్తున్నారు. మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుండగా.. 7.30 గంటలకు టాస్‌ వేస్తారు. సోనీ లివ్‌ ఓటీటీలోనూ, సోనీ స్పోర్ట్స్‌ ఛానళ్లలోనూ ఈ మ్యాచ్ చూడవచ్చు. మరి ఆసియా కప్ ఫైనల్‌లో ఏం జరుగుతుందో చూడాలి. 

Advertisment
తాజా కథనాలు