/rtv/media/media_files/2025/05/16/gMC79LfDQnq06bJADC0M.jpg)
Israeli strikes kill at least 82 people in Gaza as Trump wraps up his Middle East visit
ఇజ్రాయెల్ హమాస్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. గాజాపై ఇజ్రాయెల్ వరుస దాడులతో విరుచుకుపడుతోంది. తాజాగా దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్, దేర్ అల్బలా నగర శివార్లపై వైమానిక దాడులకు దిగింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు జరిగిన ఈ దాడుల్లో 82 మంది మృతి చెందారు.
Also Read: భారత్-పాక్ యుద్ధం.. ఇతర దేశాలకు ఆయుధాల వ్యాపారం
Israel Strikes
మరోవైపు ఉత్తర, దక్షిణ గాజాపై బుధవారం జరిగిన వైమానిక దాడుల్లో 70 మంది మృతి చెందారు. అందులో 22 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఇదిలాఉండగా ఇటీవల అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ఇజ్రాయెల్లో ఉన్న అమెరికాకు చెందిన ఓ బందీని హమాస్ విడుదల చేసింది.
Also Read: పాకిస్తాన్ నుండి విడిపోవడం అంత ఈజీ కాదు.. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారాలంటే ఏం చేయాలి?
ప్రస్తుతం ట్రంప్ పశ్చిమాసియాలో పర్యటనలో ఉన్నారు. ఈ తరుణంలో ఇజ్రాయెల్ గాజాపై మళ్లీ విరుచుకుపడం చర్చనీయాంశమవుతోంది. ఇదిలాఉండగా ఇటీవల గాజాతో జరిగిన యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడారు. గాజాలో తమ యుద్ధాన్ని ఆపేందుకు ఎలాంటి మార్గం లేదని తెలిపారు. అలా ఆయన చెప్పడంతో గాజాపై కాల్పుల విరమణ ఆశలు సన్నగిల్లాయి.
Also Read: ‘వెండి గాజుల్లో వాటా ఇచ్చి తల్లి అంత్యక్రియలు జరపండి’.. చిన్న కొడుకు చిల్లర పంచాయితీ
మరోవైపు హూతీలు తమపై దాడులు జరపడాన్ని నెతన్యాహు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. హూతీలను కచ్చితంగా ఎదుర్కొంటామన్నారు. గతంలో ఏడీఎఫ్ చేసిన దాడులు గుర్తుపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఈసారి దాడులు మాములుగా ఉండవని.. బాంబు మోతలే ఉంటాయంటూ హెచ్చరించారు.
Also Read: పాక్ పరువు తీసేలా.. మోదీ మరో మాస్టర్ ప్లాన్.. దూసుకెళ్లనున్న 'ఓవైసీ బాంబ్'?
rtv-news | israel | hamas | gaza | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu