/rtv/media/media_files/2025/05/16/imwrvTCXqHE5jkhdHCxy.jpg)
Explainer Balochistan demand freedom from pakisthan rules for declare as independent nation
పాకిస్తాన్ నుంచి తమకు స్వాతంత్రం కావాలని బలుచిస్తాన్ బలంగా కోరుకుంటోంది. పాక్లో 44శాతం ఉన్న తమ భూ భాగాన్ని 1948 మార్చి 27న పాక్ బలవంతంగా కలుపుకుందనే కారణంతో బలూచ్ పోరాటం మొదలైంది. 1950, 1960, 1970లో దశల వారీగా ఏర్పాటు ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే పాక్ కు సవాలుగా 2000లో బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైంది. ఇక అప్పటినుంచి ప్రత్యేక దేశం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న బలుచిస్తాన్ ఇటీవలే తమను తాము ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. కానీ ఏదైనా దేశం అంతర్జాతీయ గుర్తింపు పొందడం అనుకున్నంత సులభం కాదు. ముఖ్యంగా ఉగ్రవాద ముద్రపడ్డ బలూచ్ కు ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. అయితే ప్రత్యేక కంట్రీ కోసం అనుసరించే పద్ధతులు ఏమిటి? బలూచిస్తాన్ ఒక దేశంగా స్థిరపడాలంటే ఏమి చేయాలి?
Also Read : ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్
ప్రత్యేక దేశం ఏర్పాటు ఈజీ కాదు..
బలూచిస్తాన్ నాయకుడు తన ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించి ఉండవచ్చు.. కానీ ఈ ప్రకటనతోనే బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తింపు పొందదు. పాక్ నుంచి విడిపోవడం బలుచిస్తాన్ కు అంత సులభం కాదు. ఒక ప్రాంతం దేశంగా గుర్తింపు పొందే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. కొత్త దేశంగా గుర్తింపు పొందాలంటే శక్తివంతమైన దేశాల మద్దతు అవసరం. బలూచిస్తాన్ స్వాతంత్రానికి ఐక్యరాజ్యసమితి సహాయం, ప్రపంచంలోని ప్రధాన శక్తుల మద్దతు తప్పనిసరి. మొదటగా బలూచిస్తాన్ను విడిచిపెట్టడానికి పాకిస్తాన్ అంగీకరించాలి. రెండవది బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారడానికి అగ్రరాజ్యాల మద్దతు లభించాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ అవకాశం కనిపించట్లేదు.
ఐక్యరాజ్యసమితి గుర్తింపు ప్రక్రియ..
ప్రత్యేక దేశం కోసం ముందుగా ఆ ప్రాంతం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్కు ఒక దరఖాస్తు పంపించాలి. అందులో ఆ ప్రాంతం ఒక దేశంగా ఐక్యరాజ్యసమితి చార్టర్ను అంటే రాజ్యాంగాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేయాలి. ఐక్యరాజ్యసమితి దరఖాస్తును స్వీకరించిన తర్వాత దానిని భద్రతా మండలికి పంపుతారు. భద్రతా మండలిలోని 15 మంది సభ్యులలో కనీసం 9 మంది ఈ ప్రాంతం ఒక దేశంగా మారాలనే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలి. కౌన్సిల్లోని 15 సభ్య దేశాలలో 5గురు శాశ్వత సభ్యులు.. చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా ఆ ప్రాంతం దేశంగా మారడానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆ దరఖాస్తు తిరస్కరించబడుతుంది. ఒకవేళ దరఖాస్తు ఆమోదించబడితే ఐక్యరాజ్యసమితిలో దేశం చేరడానికి కౌన్సిల్ సిఫార్సును జనరల్ అసెంబ్లీకి తీసుకువెళతారు. జనరల్ అసెంబ్లీలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. ఏదైనా కొత్త దేశం ఐక్యరాజ్యసమితిలో గుర్తింపు పొందాలంటే జనరల్ అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం పాక్ తీవ్ర సంక్షోభంతో పాటు భారత్ తో వార్ నేపథ్యంలో బలూచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితిలో మద్దతు లభించే అవకాశం లేదు.
Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?
ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉంటేనే..
ఐక్యరాజ్యసమితి గుర్తింపు లేకుండా ఏ ప్రాంతమూ దేశంగా మారదు. ఏదైనా ప్రాంతం తనను తాను ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నా.. ఐక్యరాజ్యసమితి దానిని గుర్తించకపోతే ఆ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో దేశంగా పరిగణించరు. ఒక స్వతంత్ర భూభాగాన్ని ఐక్యరాజ్యసమితి ఒక దేశంగా గుర్తించి, ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఇస్తేనే అది అంతర్జాతీయంగా సహాయం పొందవచ్చు. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి రుణం, లేదా ఐక్యరాజ్యసమితి సంస్థల నుండి సహాయం తీసుకోవాలన్నా ప్రతి పనికి ఐక్యరాజ్యసమితి సభ్యత్వం అవసరమే.
లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థ..
అస్లం బలోచ్ నాయకుడుగా ఉన్నప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి దాడులు మొదలుపెట్టింది. దీనిని 'ఫిదాయీ దాడులు'గా చెప్పుకుంటూ 2018 ఆగస్టులో పాక్ లో జరిగిన ఆత్మాహుతి దాడికి తమదే బాధ్యత అని అంగీకరించింది. అప్పటినుంచి ఈ దాడులు విస్తరిస్తూ బలూచిస్తాన్లోని మిగతా ప్రాంతాలకూ వ్యాపించాయి. లిబరేషన్ ఆర్మీ అధిక దాడులకు పాల్పడింది. దీంతో 2006లో పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. ఆ తర్వాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని బ్రిటన్, అమెరికా కూడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. ఈ మేరకు బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడితే ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఉగ్రవాదులకు ప్రత్యేక దేశాన్ని స్వాగతించే ఛాన్స్ ఏ కోణంలో కనిపించట్లేదు.
Also Read : నవంబర్లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?
మొదటి సాయుధ తిరుగుబాటు..
పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ బలుచిస్తాన్. బలూచ్ తెగ పేరు మీదుగా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. గ్యాస్, ఖనిజాలతో సహా సహజ వనరుల అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో సున్నీ ముస్లింలు అధికంగా ఉన్నారు. 1970 దశకంలో పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు పాకిస్తాన్ పాలనకు వ్యతిరేకంగా బలూచిస్తాన్లో సాయుధ తిరుగుబాటు మొదలైంది. సైనిక నియంత జియావుల్ హక్ అధికారం చేజిక్కించుకున్న తర్వాత బలూచ్ రాజకీయ నేతలతో చర్చలు జరిపి సాయుధ తిరుగుబాటు ముగించేశారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా అండర్గ్రౌండ్లోకి వెళ్లిపోయింది. కానీ ఆ తర్వాత మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ హయాంలో బలూచిస్తాన్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ నవాజ్ మిరీ హత్య ఆరోపణలపై నవాబ్ ఖైర్ బక్ష్ను అరెస్టు చేశారు. దీంతో 2000 సంవత్సరంలో బలూచిస్తాన్ ప్రభుత్వ సంస్థలు, భద్రతాదళాలపై వరుస దాడులు జరిగాయి.
భారత్, ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి..
పాక్ తమ ప్రజలపై హింస, కిడ్నాప్లు, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని బలూచిస్థాన్ నాయకుడు మీర్ యార్ బలూచ్ ఆరోపిస్తున్నారు. అందుకే పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ ను అధికారికంగా స్వాతంత్ర దేశంగా ప్రకటించామని చెబుతున్నారు. ఇదే క్రమంలో భారతదేశంతో సహా అంతర్జాతీయ సమాజం తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో బలూచ్ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించడానికి మీర్ యార్.. భారత్ అనుమతి కోరారు. బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని, కరెన్సీ, పాస్పోర్ట్ల కోసం బిలియన్ల రూపాయల నిధులను ఇవ్వాలని ఆయన ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఐక్యరాజ్యసమితి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
గతంలో సోమాలిలాండ్ ..
తూర్పు ఆఫ్రికాలోని సోమాలిలాండ్ ప్రాంతం సైతం స్వతంత్ర దేశంగా భావిస్తుంది. సోమాలిలాండ్ 1991లో సోమాలియా నుండి విడిపోయినట్లు ప్రకటించుకుంది. కానీ అంతర్జాతీయంగా ప్రత్యేక దేశంగా గుర్తింపు పొందలేదు. సోమాలిలాండ్ ఒక ప్రజాస్వామ్య దేశం, అక్కడ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. సోమాలియా కంటే వేగంగా అభివృద్ధి చెందుతుంది. కానీ ఇప్పటివరకు ఐక్యరాజ్యసమితితోపాటు ఏ దేశం కూడా సోమాలిలాండ్ను ప్రత్యేక దేశంగా గుర్తించలేదు.
సెర్బియా నుంచి కొసావో..
యుగోస్లేవియా విచ్ఛిన్నం తర్వాత సెర్బియా కొత్త దేశంగా ఆవిర్భవించింది. అలాగే సెర్బియాలోని కొసావో ప్రాంతం స్వాతంత్రం కోరుకోగా.. సెర్బియా అణచివేయడానికి ప్రయత్నించింది. కానీ ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు, అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాలు కొసావోకు మద్దతుగా నిలిచాయి. సెర్బియా నుంచి కొసావోను విముక్తి చేయడానికి ఐక్యరాజ్యసమితి, నాటో నేతృత్వంలోని సైన్యం అండగా నిలిచింది. కానీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏ దేశ సరిహద్దుల్లోనూ బలవంతంగా మార్పు చేయలేమని ఐక్యరాజ్యసమితిలోని దేశాల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడింది. దీంతో ఐక్యరాజ్యసమితి స్వయంగా ఒక ప్రాంత ప్రజలకు స్వయం నిర్ణయాధికార హక్కును ఇచ్చింది. కొసావో ప్రజలు ఈ హక్కును ఉపయోగించి సెర్బియా నుండి విడిపోవాలని కోరుకున్నారు. కానీ అమెరికా, ఐక్యరాజ్యసమితి కొసావోను స్వతంత్ర దేశంగా ప్రకటించడానికి బదులుగా దానిని స్వయంప్రతిపత్తి ప్రాంతంగా ప్రకటించి, అక్కడి ప్రజలకు మరిన్ని హక్కులు కల్పించాయి. అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాలు కొసావోను దేశంగా గుర్తించాయి. కానీ ఐక్యరాజ్యసమితి దానిని ప్రత్యేక దేశంగా పరిగణించట్లేదు.
balochistan | pakistan | united-nations | telugu-news | today telugu news | international news in telugu | politics | latest-telugu-news