/rtv/media/media_files/2025/05/17/PgCs0nb1ZMHPNIdSZcQs.jpg)
ప్రతీకార సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టువదలడం లేదు. ఏదో విధంగా మిగతా దేశాలను బాదాలని డిసైడ్ అయ్యారు. అందుకే మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. స్టీల్, అల్యూమినియంపై సుంకాలను 50 శాతానికి పెంచుతూ ట్రంప్ సంతకం చేశారు. పెంచిన సంకాలు నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు వైట్హౌస్ ప్రకటించింది.
వాణిజ్య యుద్ధానికి తెర..
ఇప్పటికే ప్రతీకార సుంకాలపై పలు దేశాలు అమెరికాతో చర్చలు జరుపుతున్నాయి. చైనా లాంటి దేశాలు గొడవపడుతున్నాయి. తాజాగా వీటిపై అమెరికాలోని ఒక కోర్టు స్టే ఇచ్చింది. మరో కోర్టు దాన్ని ఎత్తేసింది. ఇంత రచ్చ జరుగుతున్నా ఈ సుంకాల విషయంలో మాత్రం ట్రంప్ తగ్గేదే లే అంటున్నారు. ఒకవైపు పలు దేశాలతో చర్చలు జరుపుతూనే మరోవైపు సుంకాలను పెంచేశారు. ఇంతకు ముందు స్టీల్ , అల్యూమినియంపై 25 శాతం సుంకాలను విధిస్తే ఇప్పుడు దాన్ని 50 శాతానికి పెంచారు. దీంతో మరోసారి అమెరికా వాణిజ్య యుద్ధానికి తెర లేపినట్టయింది. నిజానికి ఈ సుంకాల పెంపు విషయంగల వారమే ట్రంప్ ప్రకటించారు. అప్పటి నుంచి వాణిజ్య పరంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు మోదీ బిగ్షాక్ ఇచ్చారు. అమెరికా సుంకాలకు ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు డబ్ల్యూటీఓకు భారత్ తెలిపింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత కఠినంగా మారనున్నాయి. అమెరికాకు ఎగుమతి చేసిన ఉక్కు, అల్యూమినియంలపై మొదట 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. జూన్ 4 నుంచి దాన్ని 50 శాతానికి పెంచనున్నట్లు చెప్పాడు. దీంతో భారత్ ఎగుమతులపై ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే భారత్ WTOను ఆశ్రయించింది. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత సమయంలో ట్రంప్ పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. పాకిస్తాన్కు ఆయుధాలు, రుణాలు ఇప్పించడంలో అమెరికా పాత్ర పోషించింది.
Also Read: IRAN: ఇరాన్ లో కిడ్నాప్ అయిన యువకులు క్షేమం..కన్ఫార్మ్ చేసిన ఎంబసీ