IPL 2025: ఐపీఎల్ లో ఆర్సీబీకి దక్కిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

 ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీ పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీని అందుకుంటోంది. మొత్ంత 20 కోట్లు ఈ జట్టు సొంతం అయ్యాయి. రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కు రూ.12.5 కోట్లు దక్కాయి.

author-image
By Manogna alamuru
New Update
IPL

RCB

 ఐపీఎల్ అంటేనే బోలెడంత డబ్బు. ముందే ఆటగాళ్ళను చాలా పెద్ద మొత్తంలో ఫ్రాంఛేజీలు కొనుక్కుంటాయి. తరువాత సీజన్ ఎండ్ లో వచ్చిన అవార్డలును బట్టి మళ్ళీ కొంత డబ్బును ముట్టజెపుతారు. అన్నిటికంటే ఎక్కువగా టైటిల్ విన్నర్ హ్యూజ్ మనీని గెలుచుకుంటోంది. అందుకే ఐపీఎల్ లో ఆడేందుకు ప్రతీ ఆటగాడు ఆసక్తిని చూపిస్తాడు. ఇప్పుడు వస్తున్న యంగ్ ప్లేయర్లు అయితే మెయిన్ స్ట్రీమ్ క్రికెట్ ఆడకపోయినా పర్వాలేదు. ఐపీఎల్ లో ఆడిత చాలు అన్నట్టు ఉన్నారు. ఒక సీజన్ ఆడితే చాలు జీవితంలో సెటిల్ అయిపోయేంత డబ్బు వస్తోంది. అందుకే ఈ టోర్నీకి విపరీతమైన క్రేజ్. దీని ద్వారా బీసీసీఐకు కూడా కాసుల వర్షం కురుస్తోంది. 

టైటిల్ విన్నర్ గెలుచుకున్న మనీ.. 

ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిలిచింది. అందుకు గానూ ఈ టీమ్ రూ.20 కోట్లు ప్రైజ్ మనీ దక్కించుకుంది. అలాగ రననరప్ గా నిలిచిన పంజాబ్ జట్టుకు రూ.12.5 కోట్లు దక్కాయి. ఇక ఎక్కువ రన్స్ బాది ఆరెంజ్ క్యాప్ సంపాదించుకున్న సాయి సుదర్శన్ రూ.10 లక్షలు...ఎక్కువ వికెట్లు తీసి పర్సుల్ క్యాప్ హోల్డర్ గా నిలిచిన ప్రసిద్ధ కృష్ణ రూ.10 లక్షలు ప్రైజ్ మనీగా దక్కింది. టోర్నీ మొత్తంలో అత్యంత పిన్న వయస్కుడు అయిన వైభవ్ సూర్యవంశీ టాటా కర్వ్ గెలుచుకున్నాడు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు