/rtv/media/media_files/2025/06/04/9azG0PyjJDSzqOlRECD8.jpg)
Vijay Mallya - RCB: IPL 2025లో ఆర్సీబీ ఎట్టకేలకు విజయం సాధించింది. ఐపీఎల్ కప్ గెలవాలనే ఆ టీం ఫ్యాన్స్ 18 ఏళ్ల కలని నిజం చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ సందర్భంగా ఆ టీం వ్యవస్థాపక యజమాని విజయ్ మాల్యా స్పందించాడు. విజయ్ మాల్యా తన X ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఆర్సీబీ విజయం సాధించినందుకు అభినందనలు! చివరకు కప్ గెలుచుకున్నందుకు సంతోషంగా ఉంది. విరాట్ కోహ్లీ(Virat Kohli) తోపాటు జట్టు మొత్తం అద్భుతంగా ఆడింది. బెంగళూరుకి ఇది చాలా ప్రత్యేకమైన క్షణం. ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయమని ఆయన తన పోస్ట్లో రాశారు.
Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు
RCB are IPL Champions finally after 18 years. Superb campaign right through the 2025 tournament. A well balanced team Playing Bold with outstanding coaching and support staff. Many congratulations ! Ee sala cup namde !!
— Vijay Mallya (@TheVijayMallya) June 3, 2025
Also Read: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్
విజయ్ మాల్యా హయాంలోనే ఐపీఎల్ ప్రారంమైంది. ఆర్సీబీ ఓ బలమైన జట్టుగా ఎదిగింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఆర్థిక సమస్యలు, అతనిపై ఉన్న ఆరోపణల కారణంగా ఆయన 2016లో దేశం విడిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆర్సీబీ యాజమాన్యం యూనైటెడ్ స్పిరిట్స్కు మారింది. ప్రస్తుతం విజయ్ మాల్యా ఇంగ్లాండ్లో ఉన్నారు.
Also Read: కెప్టెన్ మారాడు కథ మారింది..
Also Read: బెంగళూరు కోసమే నేనున్నా...విరాట్