/rtv/media/media_files/2025/06/04/9pQZaTnyRfsDIsmTCKeL.jpg)
ఉత్తరప్రదేశ్లో ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. కోతుల గుంపును తరిమికొట్టడానికి ఓ తండ్రి విసిరిన గొడ్డలి దెబ్బకు రెండేళ్ల కుమారుడు చనిపోయాడు. మొరాదాబాద్లో ఆరవ్ అనే బాలుడు ఇంటి లోపల ఆడుకుంటున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. కోతుల గుంపు అక్కడికి వచ్చాయి. బాలుడి తండ్రి లఖన్ సింగ్ ఆ కోతులు తన కొడుకుపై దాడి చేస్తాయని భావించి వాటిని తరిమికొట్టడానికి కోతుల పైకి గొడ్డలిని విసిరాడు. దురదృష్టవశాత్తు అది ఆరవ్ను తాకి, అతని మెడకు చిక్కుకుంది.
Also Read : పవన్ కల్యాణ్ గొప్ప మనసు.. రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన PSPK.. కారణం అదే.. ?
Also Read : టీజీ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పట్నుంచంటే?
పోలీసులకు సమాచారం ఇవ్వకుండా
ఆరవ్ కేకలు విన్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కొద్దిసేపటికే, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బాలుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అయితే లఖన్ సింగ్ బావమరిది జితేంద్ర సింగ్ ఇది ప్రమాదం కాదని, హత్య అని ఆరోపించారు. పథకం ప్రకారమే లఖన్ తన భార్య అనితతో జరిగిన గొడవలో భాగంగానే తన కొడుకును చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిన కేసు అని పోలీసులు భావిస్తున్నారు.
Also Read : చౌటుప్పల్ వద్ద ఘోరం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు.. ఇద్దరు స్పాట్ డెడ్ - 20 మంది!
Also Read : కన్నడ భాష వివాదం.. కమల్ హాసన్ సంచలన నిర్ణయం
Uttar Pradesh | father | son | monkeys