/rtv/media/media_files/2025/02/15/9ZpjE6GXE9R5jCSZnt1z.jpg)
Live News Updates in Telugu
🔴Live News Updates:
Telangana: తెలంగాణలో ద్రోణి ప్రభావం... మరో 2 రోజులు వానలు.. పిడుగులు!
తెలంగాణలో రాగల రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ,వరంగల్ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
తెలంగాణలో మరో రెండు రోజులు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం,మంగళవారం ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం ఏప్రిల్ 20 సాయంత్రం హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Also Read: Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు!
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్,యాదాద్రి భువనగిరి, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ శాఖ తెలిపింది.
Also Read: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్
ఇక ఈరోజు సోమవారం కూడా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా నల్లగొండ, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బలమైన ఈదురు గాలులు, పిడుగుల సమయంలో సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. మరోవైపు కొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఆదిలాబాద్లో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2- 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read: Pavani Reddy : మొదటి భర్త ఆత్మహత్య.. రెండో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ!
Also Read: Prakasam: క్రికెట్ గ్రౌండ్లో పిడుగుపాటు.. చెట్టుకిందికెళ్లిన ఇద్దరు బాలురు మృతి
-
Apr 21, 2025 21:16 IST
GT vs KKR: చెండాడేసిన గుజరాత్.. కెకెఆర్ ముందు 199 టార్గెట్ - ఎవరి స్కోర్ ఎంతంటే?
-
Apr 21, 2025 20:54 IST
GT vs KKR: కెప్టెన్ గిల్ వీరబాదుడు.. 15 ఓవర్లకు 1 వికెట్ - పరుగులే పరుగులు
-
Apr 21, 2025 20:54 IST
GT vs KKR: దంచికొడుతున్న గుజరాత్ ఓపెనర్లు.. 10 ఓవర్ల స్కోర్ ఎంతంటే?
గుజరాత్ vs కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ చేస్తున్న గుజరాత్ జట్టు 10 ఓవర్లలో 0 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజ్లో గిల్ (49*), సుదర్శన్ (36*) ఉన్నారు.
-
Apr 21, 2025 19:06 IST
అడ్డంగా బుక్కైన మణుగూరు CI.. ఏసీబీకి ఎలా దొరికాడంటే?
-
Apr 21, 2025 19:06 IST
మరో పదిరోజుల్లో పెళ్లి.. ఇంతలోనే... గుండెపగిలేలా ఏడుస్తున్న కన్నతల్లి
-
Apr 21, 2025 19:05 IST
ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లో ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
-
Apr 21, 2025 18:20 IST
ఆల్టైమ్ రికార్డు.. లక్ష దాటిన బంగారం ధర
-
Apr 21, 2025 16:38 IST
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు రూ.25 లక్షలు ఇచ్చిన చెన్నమనేని రమేష్
చెన్నమనేని రమేష్ వారసత్వ కేసులో తెలంగాణ హైకోర్ట తీర్పు ప్రకారం అతను ఆది శ్రీనివాస్కు రూ.25 లక్షల డీడీ ఇచ్చారు. తప్పుడు పత్రాలు సమర్పించి ఆది శ్రీనివాస్ను ఎమ్మెల్యే కాకుండా అడ్డుకున్నట్లు 2024 డిసెంబర్లో హైకోర్టు తేల్చి చెప్పింది.
-
Apr 21, 2025 14:49 IST
మెంటల్ టార్చర్, బాడీ షేమింగ్ చేశారు.. కీరవాణి పై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు!
-
Apr 21, 2025 14:47 IST
మెదక్లో మరో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి వాగులో దూకిన తల్లి!
మెదక్ జిల్లా తూప్రాన్లో హల్దీవాగు దగ్గర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన మమత అనే తల్లి, తన ఇద్దరు చిన్నారులతో కలిసి వాగులో దూకింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మమతను స్థానికులు కాపాడారు.
-
Apr 21, 2025 14:04 IST
Pope Fransis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
-
Apr 21, 2025 10:40 IST
IT Employees Accident: మరణంలోనూ వీడని స్నేహం.. ఇద్దరు ఐటీ ఉద్యోగుల దుర్మరణం!
-
Apr 21, 2025 10:39 IST
Crime news: బావ ఆస్తిపై కన్నేసిన బావమరిది.. ఏకంగా అక్కతో కలిసి మర్డర్ స్కెచ్!
-
Apr 21, 2025 07:01 IST
విషాదం.. పిడుగుపాటుకు ఒకే రోజు స్పాట్లోనే ఐదుగురు..?
-
Apr 21, 2025 07:00 IST
Israel: సైన్యం తప్పు వల్లే ఆ మరణాలు.!