విషాదం.. పిడుగుపాటుకు ఒకే రోజు ఎంత మంది చనిపోయారంటే?

రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో ఒకే రోజు ఐదుగురు పిడుగు పాటుతో మృతి చెందారు. క్రికెట్ ఆడుతుండగా ప్రకాశంలో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, కడపలో ఒకరు మృతి చెందారు. వేర్వేరు జిల్లాల్లో పిడుగు పాటు వల్ల ఒకే రోజు మృతి చెందారు.

New Update
Thunderbolt

Thunderbolt

రాష్ట్రంలో ఒకే రోజు పిడుగుపాటుతో ఐదుగురు మృతి చెందారు. ప్రకాశం, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో ఒకే రోజు ఈ సంఘటనలు జరిగాయి. ప్రకాశం జిల్లాకి చెందిన సన్నీ (17), ఆకాశ్‌ (18) ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి పొలంలో క్రికెట్ ఆడుతున్నాడు. ఈ సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు వచ్చి భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో వారు సమీపంలోని వేప చెట్టు దగ్గరకు వెళ్లారు.

ఇది కూడా చూడండి: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్

ఆసుపత్రికి తరలించేలోగా..

అదే సమయంలో గొర్రెలకాపరి కూడా అక్కడికి చేరారు. ఇదే సమయంలో పిడుగు పడటంతో సన్నీ, ఆకాశ్ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లగా గొర్రెల కాపరి తీవ్రంగా గాయపడ్డాడు. సన్నీ, ఆకాశ్‌లను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక కర్నూలు జిల్లాలో పెద్దకడబూరు మండలంలో ఈరన్న మొక్కు కోసం గుడికి వెళ్లారు.

ఇది కూడా చూడండి: Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ వీడియో

ఆ సమయంలో ఆలయ సమీపంలో పిడుగుపడటంతో ఈరన్న కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఇదే జిల్లాలో పశువుల పాక సమీపంలో ఉన్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో రైల్వే ఉద్యోగి శివన్న(65) చనిపోయాడు. అలాగే జమ్మలమడుగు మండలంలో యువరైతు దండు భాను ఓబులేశు(22) పొలానికి వెళ్లి వస్తుండగా పిడుగు పడింది. దీంతో ఆ యువ రైతు అక్కడిక్కడే మృతి చెందాడు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: మాజీ డీజీపీని దారుణ హత్య చేసిన భార్య..!

ఇదిలా ఉండగా ద్రోణి ప్రభావం వల్ల మరో రెండు రోజులు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణలో ద్రోణి ప్రభావం... మరో 2 రోజులు వానలు.. పిడుగులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు