/rtv/media/media_files/2025/04/21/IjYHLAdbg9TDPYmwl4Zz.jpg)
Nandyala incident groom spot dead in accident
మరో పదిరోజుల్లో పెళ్లనగా.. పెళ్ళికొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పారాణితో చూడాల్సిన కొడుకును ప్రాణం లేకుండా చూసిన ఆ కన్నతల్లి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. పెళ్లి భాజాలతో కళకళలాడుతూ ఉండాల్సిన కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఈ విషాదకరమైన ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూర్ పట్టణం ఏకలవ్య నగర్ లో చోటుచేసుకుంది.
Also Read : Saudi Arabia: వెంటనే ఆపేయండి.. ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చిన సౌదీ
Also Read : పోలీసులకు చిక్కిన అఘోరీ-శ్రీవర్షిణీ.. తెలంగాణకు పయణం!
పెళ్లి పత్రికలూ ఇవ్వడానికి వెళ్ళి..
అయితే ఆత్మకూరు కి చెందిన నాగేంద్ర అనే యువకుడు ఈ నెల 30న తన పెళ్లి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో బంధువులందరికీ పెళ్లి పత్రికలు ఇస్తూ వస్తున్నాడు. అలా వరుడు నాగేంద్ర లింగాల గ్రామంలోని తన బంధువులకు పత్రిక ఇచ్చేందుకు వెళ్ళాడు. పత్రిక ఇచ్చిన తర్వాత తిరిగి ఆత్మకూర్ కి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నాగేంద్ర వెళ్తున్న బైక్ ని బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు నాగేంద్ర అక్కడిక్కడే మృతి చెందాడు. మరో పది రోజుల్లో పెళ్లి చేసుకొని.. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాల్సిన కొడుకు.. ఇక లేడని తెలియడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగింది. అతడి కన్న తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
Also Read : అడ్డంగా బుక్కైన మణుగూరు CI.. ఏసీబీకి ఎలా దొరికాడంటే?
Also Read : ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్!
nandyala-district-atmakuru | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | andhra-pradesh-news | andhra-pradesh-crime-reports | telugu crime news