/rtv/media/media_files/2025/04/21/yUACwUU19dNT2GB9MPni.jpg)
GT vs KKR gill
ఐపీఎల్ 2025 సీజన్ హోరా హోరీగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్ కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న గుజరాత్ జట్టు అదరగొడుతోంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. తాజాగా 15 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. ఈ 15 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 139 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్లో గిల్ (61*), జోష్ బట్లర్ (22*) ఉన్నారు. ఓపెనర్ సాయి సుదర్శన్ 36 బంతుల్లో 52 పరుగులు చేసి ఔటయ్యాడు.
బాదేసిన ఓపెనర్లు
టాస్ గెలిచిన కెకెఆర్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ క్రీజ్లోకి వచ్చారు. మొదటి నుంచి దూకుడుగా ఆడుతున్నారు. తొలి 2 ఓవర్లకు 12 పరుగుల స్కోర్ చేశారు. ఇద్దరూ నిలకడగా దుమ్ము దులిపేస్తున్నారు.
ఒక్క వికెట్ పడకుండా పరుగుల వరద పెట్టిస్తున్నారు. కెకెఆర్ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్నారు. ఇలా 5 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 38 పరుగులు చేశారు. ఓవైపు సుదర్శన్, మరోవైపు గిల్ ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోతున్నారు. తాజాగా గుజరాత్ జట్టు 10 ఓవర్లు పూర్తి చేసుకుంది. ఈ 10 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది.