/rtv/media/media_files/2025/01/28/s1UuSuJHkj8pJZaFDAsZ.jpg)
Pm Narendra Modi, President Trump
అగ్రరాజ్యం అమెరికా, భారత్ ల మధ్యంతర ట్రేడ్ డీల్ మరికొన్ని వారాల్లో కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ వేదికగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని చెబుతున్నారు. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ అందుబాటు, సుంకాలు తగ్గింపు, ప్రతీకార సుంకాలలో మినహాయింపులు వంటి అంశాలు ప్రధాన అజెండాగా ఈ చర్చలు జరిగాయని తెలుస్తోంది. అమెరికా, భారత్ రెండు దేశాలకూ లాభం చేకూరేలా ఒప్పందం కుదుర్చుకునేలా చర్చించారని చెబుతున్నారు. దీనికి సంబంధించి మధ్యంతర డీల్ ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
2030 కు 500 బిలియన్ డాలర్ల వాణిజ్యం..
అమెరికా, భారత్ రెండు దేశాల మధ్యనా ప్రస్తుతం 190 బిలియన్ డాలర్ల వాణిజ్యం నడుస్తోంది. దీన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. త్వరలో ప్రకటించే మధ్యంతర ట్రేడ్ డీల్ లో దీన్ని చెబుతారని అంటున్నారు. అయితే వీటిపై జరిగిన చర్చల్లో అమెరికా వ్యవసాయ దిగుమతులకు సంబంధించి చాలా డిమాండ్లను చేసిందని...వాటిన భారత్ తిరస్కరించిందని సమాచారం. అలాగే ఉక్కుపై వాషింగ్టన్ విధించిన 50 శాతం సుంకం నుంచి భారత్ను మినహాయించాలని మన ప్రతినిధులు కోరగా.. దానికి బదులుగా అమెరికా నుంచి సీఎన్జీ, క్రూడ్ ఆయిల్, బొగ్గు దిగుమతులను పెంచుకుంటామని ఆ దేశం కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: Covid : భయపెడుతున్న కరోనా భూతం..ప్రధాని కేబినెట్ మీటింగ్ హాజరుకూ పరీక్షలు తప్పనిసరి