🔴Live News Updates: భారత్తో యుద్ధం చేసేందుకు చైనాతో కలిసి పాక్ కుట్ర
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
వల్లభనేని వంశీపై గన్నవరం పీఎస్ లో మరో కేసు నమోదైంది. నియోజకవర్గంలో మైనింగ్ లో అక్రమాలు జరిగాయంటూ మైనింగ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో విచారణకు త్వరలోనే కోర్టులో గన్నవరం పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేయనున్నారు.
ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకొని విజయవాడలో సెప్టెంబర్ 16న సాయంత్రం 7 గంటలకు తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత పురంధేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బాసూరు గ్రామానికి చెందిన యువతీ, యువకుడికి గురువారం రాత్రి పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా డీజే పాటలకు నృత్యాలు చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న బంగారు నాయుడు డీజే పాటలకు స్టెప్పులేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.
ఓ బస్సు కండక్టర్పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని బెంగళూరు బస్టాండ్లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు నవాజ్బాషా, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఏపీ, తెలంగాణ ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి, విశాఖపట్నం మధ్య రెండు స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు తెలిపింది. మే 17, 18 తేదీల్లో వీటిని నడపనున్నారు. 07441, 07442 ట్రైన్ నంబర్లతో ఇవి నడవనున్నాయి.
కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 70% వాటా వచ్చేలా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ముందు వాదించాలని సూచించారు. కృష్ణా బేసిన్లో 70% తెలంగాణలో, 30% మాత్రమే ఏపీలో ఉందన్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు శ్రీనగర్ను సందర్శించారు.లాల్ చౌక్లోని పోలో వ్యూ మార్కెట్లో దుకాణదారులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో సాధారణ స్థితిని పునరుద్ధరించడంతో పాటు పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం చేస్తున్న కృషిని వివరించి భరోసానిచ్చారు.