/rtv/media/media_files/2025/11/03/bus-accident-in-eluru-2025-11-03-21-39-56.jpg)
Bus accident in Eluru
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న భారతి ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. బస్సు బయలుదేరిన 20 నిమిషాలకే ఈ ప్రమాదం జరిగిందని అక్కడి వారు చెబుతున్నారు.
బ్రేకింగ్
— RTV (@RTVnewsnetwork) November 3, 2025
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్ వద్ద బోల్తాపడిన భారతి ట్రావెల్స్ బస్సు
మలుపు వద్ద బోల్తా పడిన బస్సు
ఒక యువకుడు మృతి
మిగిలిన ప్రయాణికులకు గాయాలు
ఏలూరు నుంచి బయలుదేరిన 20 నిమిషాల వ్యవధిలోనే ఘటన.#eluru#busaccident#RTVpic.twitter.com/fqi1Ntr1vh
 Follow Us