AP BREAKING: ఏపీలో రైలు ప్రమాదం
రైలు పట్టా విరిగి పెను ప్రమాదం తప్పిన ఘటన తిరుపతి జిల్లాలోని గూడూరులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.ఓ గొర్రెల కాపరి పట్టా విరిగి ఉండటాన్ని గమనించి వెంటనే రైల్వే అధికారుల కు సమాచారం అందించాడు.
రైలు పట్టా విరిగి పెను ప్రమాదం తప్పిన ఘటన తిరుపతి జిల్లాలోని గూడూరులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.ఓ గొర్రెల కాపరి పట్టా విరిగి ఉండటాన్ని గమనించి వెంటనే రైల్వే అధికారుల కు సమాచారం అందించాడు.
రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. వచ్చే క్యాబినెట్ నాటికి టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ తెస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు మొత్తం పది స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈసీ. మార్చి10 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది, 13న ఉపసంహరణకు గడువు ఉంటుంది.
చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయంపై దాడి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వైసీపీనేతలు జోగి రమేశ్, దేవినేని అవినాష్ సహా 20 మంది దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారించింది. దేవినేని అవినాష్, జోగి రమేశ్ సహా 20 మందికి బెయిల్ మంజూరు చేసింది.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. మార్చి 29లోగా ఏపీలోని ఐదుగురి ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. దీంతో ఖాళీ కానున్న ఈ ఐదు స్థానాలకు ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. మార్చి 20న పోలింగ్, ఫలితాలు వెలువడనున్నాయి.
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 92,250 మంది మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లలో 86,459 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. ఇందులో 92శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 175 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి.
కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చిలో క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు.
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తడలోని బోడి లింగాల పాడు వద్ద చిన్నారులు వెళ్తున్న నారాయణ స్కూల్ బస్ బోల్తా పడింది. బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో తల్లితో వివాహేత సంబంధం, ఆమె కుతుర్నే గర్భవతి చేసిన దారుణం వెలుగుచూసింది. వెంటకగిరి పోలీస్స్టేషన్ పరిధిలో షేక్ రబ్బానీ(38) బాధితురాలి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని, కూతురిపై కన్నేశాడు. మరో వ్యక్తితో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు.