AP Crime: ఏపీలో అమానుషం.. ఫోన్ దొంగిలించిందన్న అనుమానంతో 10ఏళ్ల చిన్నారి మూతి కాల్చి..!

ఫోన్ దొంగిలించిందన్న అనుమానంతో 10ఏళ్ళ బాలికపై వాతలు పెట్టిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఫోన్ పోయిందని జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లగా పక్కింటి చిన్నారి తీసిందని చెప్పాడు. దీంతో ఆ చిన్నారిని పొయ్యిదగ్గరకు తీసుకెళ్లి అట్లకాడ కాల్చి వాతలు పెట్టారు.

New Update
nellore crime Attack on ten year old girl for stealing phone in nellore

nellore crime Attack on ten year old girl for stealing phone in nellore

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ 10 చిన్నారి సెల్ ఫోన్ దొంగిలించిందన్న అనుమానంతో కొందరు దారుణానికి పాల్పడ్డారు. ఆమె మూతి, నాలుకపై ఎర్రగా కాల్చిన అట్లకాడతో వాతలు పెట్టారు. తనకు తెలీదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. జ్యోతిష్యుడు చెప్పడంతో వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

AP CRIME

నెల్లూరు జిల్లా కుడితిపాలెం గ్రామం, కాకర్లదిబ్బకు చెందిన ఓ పదేళ్ల చిన్నారికి తల్లిదండ్రులు లేరు. దీంతో ఆమెను తన మేనత్త మాణికల మన్నారి తీసుకెళ్లి పెంచుకుంటోంది. అయితే శనివారం పొరిగింట్లో ఉండే నాగరాజు అనే వ్యక్తి ఫోన్ పొయింది. దీంతో వారు జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లగా.. పక్కింట్లో ఉండే చిన్నారి ఫోన్ దొంగిలించిందని చెప్పారు. 

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

వెంటనే నాగరాజు, ఆయన భార్య సుబ్బమ్మతో పాటు చుట్టుపక్కల ఉండే సార్ముడమ్మ, శ్రీనివాసులు,  మన్నారి (బాలిక మేనత్త) అందరూ కలిసి అనుమానంతో ఆ చిన్నారిని పొయ్యి వద్దకు తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టారు. అనంతరం అట్లకాడ ఎర్రగా కాల్చి ఆ బాలిక మూతి, నాలుక, చేతులపై వాతలు పెట్టారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారిని హాస్పిటల్‌కు పంపించారు. అనంతరం ఆ 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు