BUS ACCIDENT: ORRపై ట్రావెల్స్ బస్సు బోల్తా
హైదరాబాద్ ORRపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. మియాపూర్ నుంచి గుంటూరుకు 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న న్యూ గో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురి ప్రయాణికులకు గాయాలయ్యాయి.
హైదరాబాద్ ORRపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. మియాపూర్ నుంచి గుంటూరుకు 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న న్యూ గో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురి ప్రయాణికులకు గాయాలయ్యాయి.
ఎమ్మెల్సీ కవిత నేడు జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది.
కర్నూలు బస్సు ప్రమాదంతో తెలంగాణ రవాణా శాఖ అలర్ట్ అయింది. ట్రావెల్స్ బస్సులపై ఫిట్నెస్, పర్మిట్, బీమా, డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. పత్రాలు లేని బస్సులను సీజ్ చేసి, చలాన్లు వసూలు చేశారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
కర్నూలు బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరిన నేపథ్యంలో.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామన్నారు.
కర్నూల్లో జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రవిప్రకాశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజా రవాణాను ప్రైవేటు రంగానికి అప్పంగించిన ప్రభుత్వ వ్యవస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 లో నిర్మాణంలో ఉన్న GHMC పార్కు పనులను సీఎం రేవంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గతంలో చెత్తా చెదారంతో నిండి ఉన్న ఈ ప్రభుత్వ స్థలం కబ్జాకు గురికాకుండా.. పార్కు నిర్మాణం చేయాలని కొద్ది రోజుల క్రితం సీఎం ఆదేశించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టమైన నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది. మొత్తం 81 మందిలో 23 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. రోడ్డుపై ప్రయాణమంటేనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. హైవేలపై ఘోర రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రయాణికుల్లో భద్రతా భావం కొరవడింది.