/rtv/media/media_files/2025/06/04/JD7pfh7lxcPHamLehPdv.jpg)
travel bus road accident
విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు
లారీని ఢీకొట్టి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఆగి ఒక లారీ ఆగి ఉంది. అయితే అదే రూట్లో వచ్చిన ట్రావెల్స్ బస్సు ఆ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా ఓ మహిళా ప్రయాణికురాలు స్పాట్లో ప్రాణాలు కోల్పోయింది.
Also Read: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్
అలాగే ఈ ప్రమాదంలో మరో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారికి అక్కడ చికిత్స అందిస్తున్నారు.
Also Read: కెప్టెన్ మారాడు కథ మారింది..
లారీ అక్కడ ఎందుకుంది?
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ బ్రేక్డౌన్ అయింది. దీంతో డ్రైవర్ ఆ లారీని రోడ్డు పక్కన ఉంచాడు. అదే సమయంలో అదే రూట్లో హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి గట్టిగా డాష్ ఇచ్చింది. ఈ ఘటనతో నేషనల్ హైవేపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: బెంగళూరు కోసమే నేనున్నా...విరాట్