/rtv/media/media_files/2025/05/14/kIGZ78sFDV5ZxdoVWLkJ.jpg)
TELANGANA BREAKING NEWS
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్ లో మరో ముగ్గురికి అవకాశం కల్పించడానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు సాయంత్రం కొత్త మంత్రులతో గవర్నర్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రానికి ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బీసీ కోటాలో విజయశాంతి, వాకటి శ్రీహరి, ఆది శ్రీనివాస్, ఎస్సీ కోటాలో అద్దంకి దయకర్, వివేక్ మంత్రి పదవి రేసులో ఉన్నారు. మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు తమ నుంచి ఒకరికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ ను పట్టుబడుతున్నారు. దీంతో ఛాన్స్ ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : ఈ 3 వ్యాధులుంటే మద్యం తాగొద్దా..? తాగితే కాలేయం పాడైపోతుందా..?
కోమటిరెడ్డికి షాక్.. సుదర్శన్ రెడ్డికే ఛాన్స్?
రెడ్డి సమాజికవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి సైతం ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఒకరికి పక్కాగా ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఒక్కరు కూడా లేకపోవడం సుదర్శన్ రెడ్డికి కలివచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : ఆంధ్రప్రదేశ్లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే
ఫైనల్ లిస్ట్ ఇదే..?
తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం 6 ఖాళీలు ఉన్నాయి. ఇందులో కేవలం మూడింటిని మాత్రమే ప్రస్తుతం భర్తీ చేయాలన్నది హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. ప్రస్తుతం హైకమాండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి పేర్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అద్దంకి దయాకర్/వివేక్ వెంకటస్వామిలో ఒకరికి ఛాన్స్ పక్కా అని సమాచారం.
Also Read : బెంగళూరు తొక్కిసలాట ఘటన.. ఇద్దరు రాజీనామా
Also Read : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. కొత్త మంత్రుల లిస్ట్ ఇదే!
telangana-cabinet | komatireddy-raja-gopal-reddy | Aaddanki dayakar | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana-news-updates | telangana-politics