Palla Rajeshwar Reddy: కేసీఆర్ ఫౌంహౌస్‌లో జారిపడ్డ MLA.. పల్లాకు తీవ్ర గాయాలు

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గాయాలపాలైయ్యారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో బుధవారం ఆయన జారిపడ్డారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఆస్పత్రికి తరలింస్తున్నారు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరుకానున్న సందర్భంగా ఆయన ఫాంహౌస్‌కు వెళ్లారు.

New Update
Jangaon MLA Palla Rajeshwar Reddy

Jangaon MLA Palla Rajeshwar Reddy

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అస్వస్థతకు గురైయ్యారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో బుధవారం ఉదయం ఆయన కాలు జారిపడ్డారు. దీంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. పల్లా కాలుకు కాలు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. ఆయన్ని సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు తరలించారు. ఈరోజు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరుకానున్న సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాత్రి నుంచి ఆయన ఫాంహౌస్‌లో ఉన్నారు. హరీశ్ రావు, పలువురు బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఫామ్‌హౌస్‌లోనే ఉన్నారు. 

Also Read :  డ్రగ్స్ తో దొరికిపోయిన సింగర్ మంగ్లీ.. బర్త్ డే పార్టీలో భారీగా ఫారెన్ మద్యం!

Palla Rajeshwar Reddy Injured

Also Read :  ఈ నెలలోనే అమెరికా, భారత్ మధ్యంతర డీల్.. 500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం

కల్వకుంట్ల కవిత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా ఎర్రవల్లి ఫౌంహౌస్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ముఖ్యనేతలతో బీలాబీ బాస్ హైదరాబాద్ బయలుదేరారు. బీఆర్కే భవన్‌లో 11.30 నిమిషాలకు ఆయన కాళేశ్వరం కమిషన్ ముందు ఏర్పాటు హాజరుకానున్నారు.

2023 డిసెంబర్‌లో కేసీఆర్‌ కూడా ఆయన ఫాంహౌస్‌లో జారిపడ్డారు. దీంతో ఆయన తుంటి ఎముకకు డాక్టర్లు సర్జరీ చేశారు. కొన్ని నెలలపాటు ఆయన రాజకీయాలకు దూరంగా ఉండి. ఫాం‌హౌస్‌లోనే విశ్రాంతి తీసుకున్నారు. 

Also Read :  రాహుల్ గాంధీ వ్యాఖ్యలు హాస్యాస్పదం.. మహారాష్ట్ర పౌరులను అవమానించారన్న సీఎం

Also Read :  భయపెడుతున్న కరోనా భూతం..ప్రధాని కేబినెట్ మీటింగ్ హాజరుకూ పరీక్షలు తప్పనిసరి

palla-rajeshwar-reddy | brs-mla | latest-telugu-news | MLA Palla Rajeshwar Reddy KCR farmhouse | erravelli farmhouse kcr | janagaon-district | cbi-enquiry-on-kaleshwaram | Kaleshwaram Commission | today-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు